ఈ ముంబాయిని పోయించాడానికి వచ్చాను అంటాడు పూరి జగన్నాధ్ హీరో బిజినెస్ మన్ సినిమాలో. ఇప్పుడు పూరినే నేరుగా ముంబాయికి షిఫ్ట్ అయిపోతున్నట్లు కనిపిస్తోంది.
కరోనా ముందు నుంచి ముంబాయిలో వుంటున్న డైరక్టర్ పూరిజగన్నాధ్, ఇప్పటికీ అక్కడే వుంటున్నారు. దాదాపు ఏడాది కాలంలో ఆయన ఒకటి రెండు సార్లు మాత్రమే ఇక్కడకి వచ్చి వెళ్లారు.
ప్రస్తుతం చేస్తున్న సినిమా తరువాత కూడా పూరి నేరుగా హిందీ సినిమా చేయడానికే ఏర్పాట్లు చేసుకుని వున్నారు. ఈ సినిమా హిట్ అయితే ఇక పూరి ముంబాయిలో సెటిల్ అయిపోయినట్లే.
తెలుగులో పూరితో సినిమాలు చేయాలనుకునే వారు వున్నారు. కానీ పూరి దృష్టి మాత్రం బాలీవుడ్ మీద వుంది.
పూరి-అఖిల్ కాంబినేషన్ లో లేదా పూరి-చైతన్య కాంబినేషన్ లో ఓ సినిమా చేయాలని మైత్రీ మూవీస్ కు కోరిక వుంది. కానీ పూరి మాత్రం బాలీవుడ్ కేసి చూస్తున్నారు. ఈ లెక్కన ఇక పూరి కేరాఫ్ ముంబాయి అనే ఫిక్స్ అయిపోవాలేమో?
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు