Advertisement

Advertisement


Home > Movies - Movie News

రాధేశ్యామ్ సెట్ విరాళం

రాధేశ్యామ్ సెట్ విరాళం

ప్రభాస్-పూజా హెగ్డేలతో యువి సంస్థ నిర్మిస్తున్న సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా కోసం యాభై పడకలతో ఓ ఆసుపత్రి సెట్ వేసారు. ఇక్కడ చేయాల్సిన షూట్ కొంత చేసారు. 

కొంత మిగిలి వుంది. కానీ కరోనా సిట్యువేషన్ లో ఆసుపత్రుల్లో బెడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు జనం. ఇది దృష్టిలో వుంచుకుని, యువి సంస్థ ఈ సెట్ లోని టోటల్ ఎక్విప్ మెంట్ ను కిమ్స్ ఆసుపత్రికి డొనేట్ చేసింది.

యాభై మంచాలు, పరుపులు వగైరా, అలాగే ఆక్సిజన్ సిలెండర్లు అన్నీ డోనేట్ చేసేసారు. కొంచెం షూట్ మిగిలి వున్నా, తరువాత చూసుుకుందామని ఎక్విప్ మెంట్ ను డొనేట్ చేసి, సెట్ ను అలాగే వుంచారు. 

ఇటలీలో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకున్న రాధేశ్వామ్ కు కొద్దిగ వర్క్ మిగిలి వుంది. అదిపూర్తయితే విడుదలకు రెడీ అవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?