Advertisement

Advertisement


Home > Movies - Movie News

రాధికా శ‌రత్‌కుమార్‌ దంప‌తుల‌కు ఏడాది శిక్ష‌

రాధికా శ‌రత్‌కుమార్‌ దంప‌తుల‌కు ఏడాది శిక్ష‌

చెన్‌బౌన్స్ కేసులో ప్ర‌ముఖ నిర్మాత‌, న‌టి రాధికా శ‌ర‌త్‌కుమార్ దంపతులు ఏడాది శిక్ష‌కు గుర‌య్యారు. ఈ స‌మాచారం తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. చెన్నైలోని సైదాపేట స్పెష‌ల్ కోర్టు వీరిరువురికి ఏడాది శిక్ష విధించింది.

రాధికా శ‌ర‌త్‌కుమార్ టాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా ప్ర‌ముఖ న‌టిగా గుర్తింపు పొందారు. ఆమె నిర్మాత కూడా. టాలీవుడ్‌లో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న అనేక హిట్ చిత్రాల్లో న‌టించారు. ఆమె భ‌ర్త శ‌ర‌త్‌కుమార్ త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌ముఖ న‌టుడు. అంతేకాదు రాజ‌కీయ నాయ‌కుడు కూడా. 

శరత్ కుమార్, రాధిక, మరో నిర్మాత లిస్టిన్ స్టీఫెన్‌ పలు సినిమాలను సంయుక్తంగా నిర్మించారు. 2015లో 'ఇదు ఎన్న మాయం' సినిమా కోసం రాధికా, శరత్‌కుమార్‌లు రేడియంట్‌ గ్రూప్‌ అనే కంపెనీ నుంచి భారీ మొత్తంలో అప్పు తీసుకున్నారు.

అప్పు తీర్చాల‌ని ప‌లుమార్లు అడిగినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. మ‌రోవైపు  రాధికా దంప‌తులు ఇచ్చిన చెక్ కాస్త బౌన్స్ అయింది. దీంతో సదరు సంస్థ 2018లో కోర్టును ఆశ్ర‌యించింది. ఈ కేసులో 2019లో అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. మూడేళ్ల పాటు సుదీర్ఘ విచార‌ణ సాగింది. తాజాగా చెన్నై స్పెషల్‌ కోర్టు ఈ దంపతులకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ  తీర్పు వెల్ల‌డించింది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?