Advertisement

Advertisement


Home > Movies - Movie News

మళ్లీ హైదరాబాద్ కు రజనీ.. ఫ్యాన్స్ లో ఉత్కంఠ

మళ్లీ హైదరాబాద్ కు రజనీ.. ఫ్యాన్స్ లో ఉత్కంఠ

రజనీకాంత్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ఆయనిలా హైదరాబాద్ వచ్చారో లేదా తలైవ అభిమానుల్లో మరోసారి భయం పట్టుకుంది. హైదరాబాద్ కు, రజనీ ఫ్యాన్స్ కు ఓ చిన్న లింక్ ఉంది.అందుకే ఈసారి రజనీకాంత్ ఎలాంటి బాంబ్ పేలుస్తారోనంటూ అంతా బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు.

అన్నాత్తై షూటింగ్ కోసం గతంలో ఓసారి హైదరాబాద్ వచ్చారు రజనీకాంత్. సెట్స్ లో కొందరికి కరోనా సోకింది. వెంటనే హుటాహుటిన హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు రజనీ. ఆయనకు అప్పట్లో కరోనా సోకలేదు. కానీ ఆరోగ్య కారణాల్ని సాకుగా చూపిస్తూ ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అప్పట్లో తలైవ ఫ్యాన్స్ కు అదో పెద్ద దెబ్బ.

అప్పట్నుంచి పూర్తిగా రాజకీయాలకు దూరమై, ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్న రజనీకాంత్ ఇప్పుడు మరోసారి హైదరాబాద్ వచ్చారు. ఈసారి రజనీకాంత్ ఏ బాంబ్ పేలుస్తారోనంటూ బ్యాడ్ సెంటిమెంట్ ఫీల్ అవుతున్నారు అతడి అభిమానులు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెకెండ్ వేవ్ మొదలైంది. ఇతర ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో రజనీకాంత్ తన కొత్త సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయడాన్ని కొంతమంది అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. సినిమా ఎలాగూ లేట్ అయింది కాబట్టి, మరో 2 నెలలు గ్యాప్ ఇస్తే బాగుంటుందనేది వాళ్ల ఫీలింగ్.

అన్నాత్తై షూటింగ్ ఇప్పటికే 75 శాతం పూర్తయింది. మిగిలిన భాగాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేసి ఈ ఏడాదిలోనే సినిమాను రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది. ఈసారి ఎలాంటి వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది యూనిట్. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?