కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో కొత్త సినిమాల చర్చలు కూడా దాదాపుగా ఎక్కడివక్కడ నిలిచిపోయినట్టే. ఒకవేళ లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈ పాటికి ఇంకా అనేక కొత్త సినిమాల ప్రతిపాదనలు, మరి కొన్ని పట్టాలెక్కడం జరిగేది. అయితే లాక్ డౌన్ వేళ కూడా కొన్ని సినిమాల ప్రతిపాదనలు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో తెలుగు సూపర్ హిట్ సినిమా అల వైకుంఠపురంలో హిందీ రీమేక్ విషయంలో రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి.
ఇప్పటికే ఒక హీరో గా కార్తీక్ ఆర్యన్ పేరు వినిపిస్తూ ఉంది. ఇతడే హీరోగా నటిస్తాడని ఇది వరకూ ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా రణ్ వీర్ సింగ్ పేరు తెర మీదకు రావడం గమనార్హం. తెలుగులో అల్లు అర్జున్ చేసిన రోల్ లో రణ్ వీర్ సింగ్ కనిపిస్తాడనేది లేటెస్ట్ టాక్. కార్తిక్ ఆర్యన్ ను రెండో పాత్రకు పరిమితం చేయనున్నారట.
రణ్ వీర్ సింగ్ ఇది వరకూ బాలీవుడ్ లో ఒక తెలుగు రీమేక్ తో హిట్ కొట్టాడు. టెంపర్ సినిమా హిందీ రీమేక్ తో విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి రీమేక్ ప్రతిపాదన కూడా రణ్ వీర్ వద్దకే వెళ్లింది. కానీ ఎందుకో చేయలేదు. మరి ఇప్పుడు అల వైకుంఠపురంలో హిందీ రీమేక్ కు రణ్ వీర్ ముందుకు వస్తాడా అనేది ఆసక్తిదాయకమైన అంశం. విడుదల అయ్యి దాదాపు ఆరు నెలలు కావొస్తున్నా.. ఏదో రకంగా ఆ సినిమా ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతూ ఉంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు