Advertisement

Advertisement


Home > Movies - Movie News

రెండేళ్ల క్రితమే పార్టీ వదిలేసా..పృధ్వీ

రెండేళ్ల క్రితమే పార్టీ వదిలేసా..పృధ్వీ

థర్టీ ఇయర్స్ పృధ్వీ ఓ సంచలనం. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లి, స్వల్పకాలంలోనే మంచి పదవి చేపట్టారు. కానీ అంతకన్నా త్వరగా ఓ వివాదంలో చిక్కుకుని, పదవి వదిలేసుకోవాల్సి వచ్చింది. 

మరో పక్క రాజకీయాల కారణంగా సినిమా రంగంలో అవకాశాలు తగ్గిపోయాయి. మెగా క్యాంప్ దాదాపు దూరం పెట్టింది. అలాంటిది ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. 

అంతే కాదు, జనసేనను, పవన్ కళ్యాణ్ ను పొగడడం మొదలుపెట్టారు. టీవీ చానెళ్లలో కూర్చుని 2023లో జనసేనకు 40 నుంచి 50 సీట్లు వస్తాయని జోస్యాలు చెబుతున్నారు.

అలాంటి పృధ్వీ ఎఫ్ 3 సినిమా ఫంక్షన్ లో ‘గ్రేట్ ఆంధ్ర’ రెండు నిమషాలు మచ్చటించారు. ఈ మార్పు సంగతి ప్రశ్నిస్తే…’రెండేళ్ల క్రితమే నేను పార్టీకి రాజీనామా చేసా’ అని వెల్లడించారు. 

రాజీనామా చేసిన తరువాత తనకు పార్టీ నుంచి పోలీసుల నుంచి బెదిరింపులు వచ్చాయన్నారు. ‘పార్టీ కోసం ఎంతో చేసా, కోవిడ్ బారిన పడితే నన్ను పలకరించిన పాపాన పోలేదు. అందుకే ఇక నాకు పార్టీ వద్దు అని నన్ను బెదిరించిన వారికి క్లారిటీగా చెప్పాను’ అన్నారు పృధ్వీ .

ప్రస్తుతం చేతినిండా సినిమాలు వున్నాయని వెల్లడించారు. ఇంతకీ జనసేనలో చేరినట్లేనా? చేరతారా? అని ప్రశ్నించగా..చేరినట్లే అని సమాధానం ఇచ్చారు. 

తాను ఈస్ట్…వెస్ట్ లో సర్వేలు చేయించానని, వైకాపా పార్టీకి ఆ రెండు జిల్లాల్లో చెరో రెండు సీట్లు మాత్రమే దక్కుతాయని పృధ్వీ జోస్యం చెప్పారు. 

ప్రస్తుతం ప్రభాస్ సలార్ షూట్ లో బిజీగా వున్నానని, అందులో మంచి పాత్ర దొరకిందని వెల్లడించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?