సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్కు ఒక్క రోజు కూడా కంటి మీద కునుకు కరువైంది. ఏదో ఒక సమస్య నిత్యం పట్టి పీడిస్తోంది. తాజాగా దర్శకుడు అనురాగ్ కశ్యప్పై నటి పాయల్ ఘోష్ లైంగిక ఆరోపణలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. ఇటు, అటు వ్యతిరేక వర్గాలుగా విడిపోయి రాద్ధాంతం చేసుకుంటున్నారు. తనకు న్యాయం చేయాలంటూ నటి పాయల్ ఏకంగా ప్రధాని మోడీకి ట్వీట్ చేయడం గమనార్హం.
తాజాగా నటి రిచా చద్దా తనను ఈ వివాదంలోకి లాగడంపై తీవ్ర ఆగ్రహం, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తన పేరు వాడిన మూడో వ్యక్తిపై త్వరలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు ఆమె తరపు లాయర్ సోమవారం సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు.
రిచా చద్దాతో పాటు మరో ఇద్దరు నటుల పేర్లను కూడా పాయల్ వాడడం రచ్చకు దారి తీస్తోంది. తన పేరు అవమానకర రీతిలో వాడారంటూ రిచా ఆగ్రహం వ్యక్త చేశారు. వారిపై న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నట్టు ఆమె తెలిపారు. ‘అనురాగ్పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో మూడో వ్యక్తి అనవసరంగా నా క్లైయింట్ రిచా చద్దా పేరు తీసుకొచ్చారు. ఆమె అన్యాయానికి గురైన మహిళలకు న్యాయంగా జరగాలని కోరుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి పేరును అవమానకర రీతిలో వాడారు’ అని చద్దా తరపు లాయర్ అన్నారు.
‘ఆధారాలు లేని తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా ఇతర మహిళలను అనవసరంగా వివాదంలోకి లాగి సమాజంలో వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఓ మహిళ తన స్వేచ్చా పోరాటంలో మరో మహిళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే హక్కు లేదు. దీనిని తీవ్రంగా ఖండించడమే కాకుండ న్యాయ పోరాటానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తాం’ అని పేర్కొన్నారు.
దీంతో లైంగిక ఆరోపణలు మరో మలుపు తిరిగినట్టైంది. దర్శకుడు అనురాగ్కు భారీగా మద్దతు లభిస్తోంది. మరోవైపు కంగనా లాంటి వాళ్లు అనురాగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి ముగింపు ఎట్లా పలుకుతారో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు