మెగా బ్రదర్ నాగబాబు ఏకైక కుమార్తె, నటి నిహారిక గత ఏడాది డిసెంబర్ 9న జొన్నలగడ్డ చైతన్యతో కలిసి ఏడడుగులు నడిచారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి అనంతరం భర్తతో కలిసి తానెంత సంతోషంగా ఉన్నదో ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే వివిధ రకాల ఫొటోలు, వీడియోలే చెబుతాయి.
మరోవైపు తనకిష్టమైన సినీ కెరీర్పై ఆమె ఫోకస్ పెట్టారు. ఇందుకు ఆమె భర్త చైతన్య ప్రోత్సాహం ఎంతగానో ఉంది. పెళ్లి తర్వాత వెబ్ సిరీస్లో నటించేందుకు నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల ఓ సినిమాకు కూడా అంగీకరించినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా నిహారిక మనసు దోచిన ఆ ఆరడుగుల అందగాడు ...రొమాంటిక్ కామెంట్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అది కూడా తన శ్రీమతి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫొటోతో పాటు తెలుగు పదాల నుంచి స్ఫూర్తి పొందడం విశేషం.
తాజాగా నిహారిక ఓ ఫొటోషూట్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో ఆమె షేర్ చేశారు. ఈ పోస్టు ప్రత్యేకత ఏంటంటే ....పూర్తిగా తెలుగులో నిహారిక టైప్ చేయడం. నిహారిక టైప్ చేసిన ఆ తెలుగు పదాలు...గులాబీ, దుస్తులు, నగలు, ఛాయాచిత్ర కళాకారుడు, కర్త మరియు కర్మ, సహాయకురాలు.
ఈ పోస్ట్పై భర్త చైతన్య రొమాంటిక్గా స్పందిస్తూ..'గులాబి కళ్ళు రెండు ముల్లు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే' అంటూ తనలోని కవి హృదయాన్ని చైతన్య ప్రదర్శించారు. పనిలో పనిగా నిహారికపై తన మనసులో దాగిన ప్రేమను చాటుకున్నారు.
ఇదే పోస్టుపై మెగాస్టార్ రెండో అల్లుడు కల్యాణ్ దేవ్ కూడా ప్రశంసలు కురిపించడం గమనార్హం. నిహారిక పోస్టుపై కామెంట్స్ అన్నిటిలో ఆమె భర్త చైతన్య కామెంట్ హైలెట్గా నిలిచింది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు