Advertisement

Advertisement


Home > Movies - Movie News

సాయి మంజ్రేకర్ మీద క్లారిటీ

సాయి మంజ్రేకర్ మీద క్లారిటీ

కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ పేరు టాలీవుడ్ లో గట్టిగా వినిపించింది. మహేష్ బాబు భార్య నమ్రత ఈ హీరోయిన్ ను పిలిపించారని వార్తలు వినిపించాయి. దాంతో సాయి మంజ్రేకర్ తెలుగులో మహేష్ సరసన నటిస్తుందని చాలా మంది ఊహాగానాలు చేసారు. కానీ అంతలోనే కీర్తీ సురేష్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. దాంతో సాయి మంజ్రేకర్ పేరు అక్కడితో వినిపించడం ఆగిపోయింది. 

అయితే లేటెస్ట్ గా వచ్చిన న్యూస్ ఏమిటంటే మహేష్ బాబు తెలుగు-హిందీ లాంగ్వేజ్ ల్లో నిర్మించే మేజర్ సినిమాలో సాయి మంజ్రేకర్ నటిస్తోంది అన్నది. మేజర్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీ ఆధారంగా అడవి శేష్ హీరోగా నిర్మిస్తున్న సినిమా మేజర్. శశికిరణ్ దర్శకుడు. జిఎమ్ బి బ్యానర్ సోనీ పిక్చర్స్ తో కలిసి నిర్మిస్తున్నారు.

అంటే సాయి మంజ్రేకర్ ను నమ్రత పిలిపించింది మహేష్ సరసన నటించడానికి కాదు, మహేష్ నిర్మించే సినిమాలో నటించడానికి అనే క్లారిటీ వచ్చింది. సాయి మంజ్రేకర్ తెలుగు నిర్మాతలకు ఈ విధంగా చేరువైంది కాబట్టి, త్వరలో తెలుగు పెద్ద హీరోల సరసన నటించడం కూడా వుండెచ్చేమో?

బాబు వందల గుళ్లు కూల్చేసినా ఓకేనా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?