Advertisement

Advertisement


Home > Movies - Movie News

స‌మంతా...మీ ఖ‌ర్మ‌కు మీరే బాధ్యులు?

స‌మంతా...మీ ఖ‌ర్మ‌కు మీరే బాధ్యులు?

నాగ‌చైత‌న్య‌తో విడిపోయిన త‌ర్వాత స‌మంత త‌న కెరీర్‌పై దృష్టి సారించారు. అయితే నాగ‌చైత‌న్య‌తో విడిపోవ‌డం, నెటిజ‌న్ల నుంచి ట్రోలింగ్స్‌ ఆమెను వేటాడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌న ఆవేద‌నంతా వెల్ల‌డిస్తూ సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. దానిపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. స‌మంత పోస్ట్‌, దానికి రిప్లై అనిపించేలా త‌మిళ హీరో సిద్దార్థ్ ఘాటైన పోస్టు పెట్ట‌డం ర‌చ్చ‌కు దారి తీసింది.

ముందుగా స‌మంత పెట్టిన పోస్టు గురించి తెలుసుకుందాం.

‘కొంతమంది నెటిజన్ల నుంచి ప్రేమాభిమానాలు పొందుతున్నాను. ప్రస్తుతం వాళ్లు నా జీవితంలో భాగమైపోయారు. కానీ.. మరికొంత మంది మాత్రం  ట్రోల్‌ చేస్తున్నారు. అసభ్యకర కామెంట్లు పెడుతున్నారు. వారందర్నీ నేను కోరేది ఒక్కటే. నేను చేసే ప్రతిదాన్ని అంగీకరించాలని డిమాండ్‌ చేయను. కానీ, మీకు నా అభిప్రాయాలు నచ్చకపోతే దాన్ని చెప్పడానికి ఓ విధానం ఉంటుంది’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

స‌మంత పోస్టు నేప‌థ్యంలో త‌మిళ హీరో సిద్దార్థ్ రిప్లై ఏంటో చూద్దాం.

‘నేటి ప్రమాదరకరమైన సోషల్ మీడియా ప్రపంచంలో కొందరు స్టార్స్ .. అభిమానుల గ్రూప్స్ నిర్వహించడానికి, వారిని ఆయుధా లుగా మార్చడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఏదీ తనంతట తనే జరగదు. చివరికి తమ అభిమానులు తమనే కాటేస్తారని స్టార్స్ అర్ధం చేసుకోవడం ముఖ్యం. ఇకనైనా ప్రేమని, ద్వేషాన్ని కొనుక్కోవడం మానండి’ అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

స‌మంత కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి సోష‌ల్ మీడియాలో ఓ గ్రూప్‌ను త‌యారు చేసుకుంద‌నే అర్థంలో సిద్ధార్థ్ ప‌రోక్షంగా వ్యాఖ్యానించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్పుడు ఆమె పెంచి పోషించిన నెటిజ‌న్లు, అభిమానులే ట్రోలింగ్ చేస్తున్నార‌ని ఆ హీరో న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారంటున్నారు. త‌మ ఖ‌ర్మ‌కు తామే బాధ్యుల‌ని, దానికి ఇత‌రుల‌ను నిందించ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌ని సిద్దార్థ్ ప‌రోక్షంగా స‌మంత‌కు హిత‌వు చెప్పార‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?