అందాల తార‌ను చూసేందుకు ఎగ‌బ‌డ్డ జ‌నం

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్వ‌స్థ‌లం క‌డ‌ప గ‌డ్డ‌పై అందాల తార స‌మంత అడుగు పెట్టారు. స్టార్ హీరోయిన్‌ను చూసేందుకు క‌డ‌ప‌తో పాటు చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల నుంచి యువ‌త భారీగా న‌గ‌రానికి చేరుకుంది.  Advertisement…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్వ‌స్థ‌లం క‌డ‌ప గ‌డ్డ‌పై అందాల తార స‌మంత అడుగు పెట్టారు. స్టార్ హీరోయిన్‌ను చూసేందుకు క‌డ‌ప‌తో పాటు చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల నుంచి యువ‌త భారీగా న‌గ‌రానికి చేరుకుంది. 

క‌డ‌ప ఆర్టీసీ బ‌స్టాండ్ స‌మీపంలోని ఓ షాపింగ్‌మాల్‌ను ప్రారంభించేందుకు తాను క‌డ‌ప‌కు వెళుతున్న‌ట్టు కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియా వేదిక‌గా స‌మంత విస్తృత ప్ర‌చారం సాగిస్తోంది.

నాగ‌చైత‌న్య‌తో విడాకుల నేప‌థ్యంలో స‌మంత వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు. ఏదో ర‌కంగా ఆమెపై వివిధ మాధ్య‌మాల్లో చ‌ర్చ జ‌రుగుతూనే వుంది. దీంతో స‌మంత‌ను చూడాల‌ని అభిమానులు క‌డ‌ప ఆర్టీసీ బ‌స్టాండ్ వ‌ద్ద‌కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. 

భారీగా త‌ర‌లివ‌చ్చిన అభిమానులు ఆర్టీసీ బ‌స్టాండ్ స‌మీపంలోని భ‌వ‌నాల‌పైకి ఎక్కి ఆమెను చూసేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. క‌డ‌ప ఆర్టీసీ బ‌స్టాండ్ ప‌రిస‌రాలు జ‌నంతో కిక్కిరిసి తిరుణాళ్ల‌ను త‌ల‌పించింది.

భారీగా త‌ర‌లివ‌చ్చిన జ‌నాన్ని చూడ‌గానే స‌మంత ఉత్సాహంతో అభివాదం చేస్తూ అల‌రించారు. కొంద‌రు అభిమానులు ఆమెతో ఫొటోల‌కు దిగారు. స‌మంత‌ను చూసేందుకు వ‌చ్చిన జ‌నం వ‌ల్ల క‌డ‌ప ఆర్టీసీ బ‌స్టాండ్ స‌మీపంలో ట్రాఫిక్ జామ్ కావ‌డం గ‌మ‌నార్హం.