Advertisement

Advertisement


Home > Movies - Movie News

పాపే నా ప్రాణం అంటున్న హీరోయిన్

పాపే నా ప్రాణం అంటున్న హీరోయిన్

ఒకప్పుడు తనకు చాలా ప్రాధామ్యాలు ఉండేవని, కానీ ఇప్పుడు పాపే లోకమైపోయిందని అంటోంది హీరోయిన్ శ్రియ. పాప పుట్టిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని, ఆలోచనలన్నీ పాప చుట్టూనే తిరుగుతున్నాయని చెప్పుకొచ్చింది.

"పిల్లలు పుట్టిన తర్వాత ప్రపంచం మారుతుంది. మనకు బాధ్యతలు పెరుగుతాయి. మనిషిలో మార్పులు వస్తాయి. ఒకప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా సూట్ కేసులన్నీ సర్దుకోవాలనే ఆలోచన ఉండేది. ఇప్పుడు పాపను ఎలా తీసుకెళ్లాలి, ఎక్కడ ఉంచాలి లాంటి ఆలోచనలు ఎక్కువైపోయాయి."

ఇలా పాపే లోకంగా బతికేస్తున్నట్టు ప్రకటించింది శ్రియ. గమనం సినిమాతో మరోసారి ప్రేక్షకులముందుకొస్తున్న ఈ బ్యూటీ.. తనకు పాప పుట్టిన విషయాన్ని చాన్నాళ్ల పాటు బాహ్యప్రపంచానికి తెలియనివ్వలేదు. పెళ్లి తర్వాత స్పెయిన్ లో కాపురం పెట్టిన శ్రియ, అక్కడే పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఏడాదికి ఆ మేటర్ ను బయటపెట్టింది. శ్రియ కూతురు పేరు రాధ.

"గర్భం దాల్చి, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చాలా మార్పులొచ్చాయి. కానీ వర్కవుట్స్ చేస్తూ, కథక్ డాన్స్ చేస్తూ ఫిట్ నెస్ పై దృష్టిపెట్టాను. పైగా అమ్మ నాకు చిన్నప్పట్నుంచి యోగా నేర్పించింది. యోగా వల్ల మరింత ఫిట్ గా, ఆరోగ్యంగా తయారయ్యాను."

రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించిన శ్రియ.. ఆ మూవీపై స్పందించడానికి మాత్రం నిరాకరించింది. రాజమౌళి నుంచి అనుమతి వచ్చిన తర్వాతే ఆర్ఆర్ఆర్ పై మాట్లాడతానని స్పష్టంచేసింది. ఆమె నటించిన గమనం సినిమా 10వ తేదీన థియేటర్లలోకి వస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?