మరింత మెరుగైన ఎస్బీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం

కరోనా బారిన పడిన లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు క్రమంగా కోలుకుంటున్నారు. బాలు ఆరోగ్యం మరింత మెరుగైనట్టు ఆయన తనయుడు చరణ్ వెల్లడించాడు. అంతేకాదు.. నిన్నట్నుంచి బాలు నోటితో ఆహారం తీసుకుంటున్నారు. Advertisement “నాన్న…

కరోనా బారిన పడిన లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు క్రమంగా కోలుకుంటున్నారు. బాలు ఆరోగ్యం మరింత మెరుగైనట్టు ఆయన తనయుడు చరణ్ వెల్లడించాడు. అంతేకాదు.. నిన్నట్నుంచి బాలు నోటితో ఆహారం తీసుకుంటున్నారు.

“నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది. అయినప్పటికీ ఆయనకు వెంటిలేటర్ సహాయంతోనే ఆక్సిజన్ అందిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఊపిరితిత్తులు ఇంకా రికవర్ అవ్వాల్సి ఉంది. మిగతావన్నీ నార్మల్ గా ఉన్నాయి. రోజూ ఫిజియోథెరపీ చేస్తున్నారు. నిన్నట్నుంచి నాన్న నోటితో ఆహారం తీసుకుంటున్నారు. ఇది ఆయనలో శక్తిని మరింత పెంచుతుంది.”

ఇలా బాలు మరింత కోలుకున్నారనే విషయాన్ని చరణ్ బయటపెట్టారు. అయితే ఆయనింకా వెంటిలేటర్ సహాయంతోనే ఆక్సిజన్ తీసుకుంటున్నారనే విషయం మాత్రం అభిమానుల్ని బాధపెడుతోంది.

గత నెల 5న కరోనా బారిన పడ్డారు బాలు. ముందుగా ఓ హాస్పిటల్ లో జాయిన్ అయినప్పటికీ, మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని ఎంజీఎంకు షిఫ్ట్ చేశారు. అప్పట్నుంచి ఎంజీఎంలోనే ఉన్న బాబు, క్రమంగా కోలుకుంటున్నారు.

ప్రస్తుతం బాలు, వైద్యుల సహాయంతో లేచి కూర్చుంటున్నారు. 15-20 నిమిషాల పాటు కూర్చోగలుగుతున్నారు.