భాగమతి అంచనాలని అందుకుంది. ఈ ఏడాదిలో ఫస్ట్ క్లీన్ హిట్గా నిలిచింది. అజ్ఞాతవాసి సౌజన్యంతో సేఫ్ వెంఛర్ అనిపించుకున్న జైసింహా వల్ల బయ్యర్లకి, మార్కెట్కి ఒరిగింది ఏమీ లేదు. సంక్రాంతి సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచిన నేపథ్యంలో భాగమతి చిత్రంపైనే టాలీవుడ్ ట్రేడ్ నమ్మకం పెట్టుకుంది.
అరుంధతి మాదిరిగా సంచలనం కాలేకపోయినా కానీ ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణతో తొలివారంలో బ్రహ్మాండమైన వసూళ్లు సాధించి, హిట్ అనిపించేసుకుంది. ఈ వారంలో మరికొన్ని సినిమాలతో పోటీ వున్నప్పటికీ భాగమతికి సెకండ్ వీకెండ్ పరంగా కూడా లోటు వుండదని కలెక్షన్స్ ట్రెండ్ చెబుతోంది.
ఫామ్లో వున్న రవితేజ నటించిన 'టచ్ చేసి చూడు', నాగశౌర్య సినిమా 'ఛలో' ఈవారం విడుదలయ్యాయి. ఈ చిత్రాలు రెండూ మాస్ని టార్గెట్ చేసిన ఎంటర్టైనర్లే. రవితేజ మరోసారి 'రాజా ది గ్రేట్' తరహాలో థియేటర్లని బిజీగా వుంచుతాడనే అంచనాలున్నాయి. ఇక నాగశౌర్య సినిమాకి ప్రీమియర్స్ నుంచి టాక్ పాజిటివ్గానే వినిపిస్తోంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు