థియేటర్ల బంద్ తర్వాత మార్కెట్కి ఊపునిచ్చే సినిమా రిలీజ్ కాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద స్లంప్ మరోవారం కొనసాగింది. విజయ్ దేవరకొండ ఎప్పుడో చేసిన 'ఏ మంత్రం వేసావె' విడుదలైనా కానీ ఎవరూ పట్టించుకోలేదు. హీరోనే త్యజించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు సయితం లైట్ తీసుకున్నారు.
బంద్కి ముందు థియేటర్లలో వున్న సినిమాలకి కూడా వసూళ్లు లేకపోవడంతో మరో వారం రోజుల పాటు థియేటర్లు వెలవెలబోయాయి. మళ్లీ ఈ వారంనుంచి సినీ సందడి కనిపించనుంది. కిరాక్ పార్టీతో పాటు కర్తవ్యం రిలీజ్ అయింది. నిఖిల్ నటించిన కిరాక్ పార్టీపై యూత్ దృష్టి పడింది. మరి ఈ ఆసక్తి వసూళ్లుగా కన్వర్ట్ అవుతుందా లేదా అనేది చూడాలి.
ఐతే 2.0తో పాటు మాస్కి నచ్చిన ఫ్రాంచైజీ దండుపాళ్యం నుంచి మూడో ఎడిషన్ ఈ వారం థియేటర్లలోకి వచ్చాయి. ఇకపై వారానికో చెప్పుకోతగ్గ సినిమా విడుదలవుతుంది కనుక మళ్లీ బాక్సాఫీస్ వద్ద కళ నెలకొంటుందనే నమ్మకం కనిపిస్తోంది. గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది టాలీవుడ్కి చాలా నీరసంగా మొదలైంది. వేసవి సినిమాలతో అయినా ఆ ఊపు తిరిగి వచ్చేస్తుందనే ఆశిద్దాం.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు