Advertisement

Advertisement


Home > Politics - Andhra

కుల‌పిచ్చిపై లోకేశ్ సుద్ధులు!

కుల‌పిచ్చిపై లోకేశ్ సుద్ధులు!

దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్టుగా టీడీపీ యువ‌కిశోరం నారా లోకేశ్ కుల‌పిచ్చిపై నీతులు చెబుతున్నారు. చంద్ర‌బాబు నాయుడు, లోకేశ్‌ల‌కు ఉన్నంత‌గా కుల‌పిచ్చి మ‌రెవ‌రికీ లేద‌నే టాక్‌. అంతెందుకు ఒక సంద‌ర్భంలో కుల‌పిచ్చి, మ‌త‌పిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉందా అంటే... అది టీడీపీనే అని స్వ‌యంగా లోకేశే ఒప్పుకున్నారు. ఇప్పుడాయ‌న జ‌గ‌న్‌కు సుద్ధులు చెబుతున్నారు.

రెడ్డిరాజ్యంలో ఉద్యోగం చేయలేకపోతున్న‌ట్టు క‌లికిరి జేఎన్‌టీయూ సూప‌రింటెండెంట్ నాగ‌భూష‌ణం వాట్స‌ప్‌లో ఓ వీడియో విడుద‌ల చేశాడు. అనంతపురం నుంచి క‌లికిరి జేఎన్‌టీయూకి బ‌దిలీ చేయ‌డ‌మే ఆయ‌న ఆగ్రహానికి కార‌ణ‌మైంది. ఈ నేప‌థ్యంలో లోకేశ్ రంగంలోకి దిగారు. విశ్వ‌విద్యాల‌యాల‌ను వైసీపీ కార్యాల‌యాలుగా జ‌గ‌న్‌రెడ్డి మార్చార‌ని లోకేశ్ ఆరోప‌ణ‌.

రెడ్డి రాజ్యంలో వేధింపులు తట్టుకోలేక పదవికి రాజీనామా చేస్తున్నానని ఒక బీసీ ఉద్యోగి ప్రకటించడం అరాచక పాలనకు అద్దంపడుతుందని లోకేశ్ విమ‌ర్శించారు. జగన్ రెడ్డి సొంత సామాజిక వర్గం అధికారుల ఒత్తిడి తట్టుకోలేక కలికిరి జేఎన్టీయూ సూపరింటెండెంట్ నాగభూషణం వీఆర్ఎస్ తీసుకుంటానని ప్రకటించడం బాధాకరమన్నారు. సీఎం కులపిచ్చి తగ్గించుకుని ఇతర సామాజికవర్గాల వారి ఆత్మ గౌరవం కాపాడాలని లోకేశ్‌ హితవు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

విశ్వ‌విద్యాల‌యాలు కులం కంపు కొట్ట‌డం ఈనాటి మాట కాదు. కుల పునాదుల మీద చంద్ర‌బాబు శ్రీ‌వేంక‌టేశ్వ‌ర విశ్వ‌విద్యాలయంలో రాజ‌కీయాలు సాగించిన సంగ‌తి తెలిసిందే. కులం ప్రాతిప‌దిక‌నే రాజ‌ధాని కూడా ఏర్పాటు చేశార‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం. కులం కోసం అన్నీ చేసి, నీతులు చెప్ప‌డం లోకేశ్‌కే చెల్లింది. తాను పాలు తాగేది ఎవ‌రూ చూడ‌లేద‌ని పిల్లి అనుకుంటుంద‌ట‌. అలా వుంది కులంపై లోకేశ్ నీతి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?