Advertisement

Advertisement


Home > Politics - Andhra

విశాఖలో దారుణం.. ముక్కలుగా శరీర భాగాలు

విశాఖలో దారుణం.. ముక్కలుగా శరీర భాగాలు

శ్రద్ధావాకర్ హత్య కేసును తలపించే రీతిలో విశాఖపట్నంలో మరో హత్య బయటపడింది. మృతదేహాన్ని ముక్కలుగా చేసి ప్లాస్టిక్ కవర్లలో చుట్టి దాచిన ఘటన వైజాగ్ ను వణికించింది.

విశాఖ మధురవాడలోని వికలాంగుల కాలనీలో నివశిస్తున్నాడు రుషి. అయితే కొన్నాళ్లుగా అతడు ఆ ఇంట్లో ఉండడం లేదు. తాళం వేసి వేరే చోటు ఉంటున్నాడు. ఖాళీ చేయమంటే చేయడం లేదు, అద్దె అడిగితే ఇవ్వడం లేదు. దీంతో ఇల్లు ఖాళీ చేయించేందుకు ఓనర్ రంగంలోకి దిగాడు. ఇంట్లో సామాన్లను బయటపడేసే ప్రయత్నం చేశాడు. సరిగ్గా అప్పుడే బయటపడింది ఈ హత్య.

రుషి ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ డ్రమ్ముల్లో, కవర్లలో చుట్టిన శరీర భాగాలు ఓనర్ కంటబడ్డాయి. వెంటనే అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ మహిళను హత్య చేసి, ముక్కలు చేసి, ప్లాస్టిక్ కవర్లలో చుట్టాడు రుషి. బాగా కుళ్లిన తర్వాత ఆ ప్లాస్టిక్ సంచుల్ని పూడ్చి పెట్టాలని పథకం వేశాడు. అనుకున్న పథకం ప్రకారం ఇంటికి తాళం వేసి వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. అయితే అనుకోని విధంగా ఓనర్ రావడంతో హత్య బయటపడింది.

ఇంతకీ ఏం జరిగింది..?

ప్రస్తుతం రుషి పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇతడిది పార్వతీపురం జిల్లా సీతంపేట. రుషికి, చనిపోయిన మహిళకు మధ్య ఆర్థిక లావాదేవీలున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేవలం ఆ కారణంతోనే సదరు మహిళను హత్య చేశాడా లేక మరేదైనా ఇతర కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మృతదేహం భాగాలను కేజీహెచ్ హాస్పిటల్ కు తరలించారు. తల భాగం పూర్తిగా కుళ్లిపోయి పుర్రె మాత్రం మిగిలింది. ఇంట్లో ఇలా మృతదేహం ఉన్నప్పటికీ చుట్టుపక్కల ఇళ్లకు వాసన రాకుండా ఉండేలా ప్లాస్టిక్ బ్యాగుల్లో రుషి, ప్యాక్ చేసిన విధానం చూసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?