Advertisement

Advertisement


Home > Politics - Andhra

గోరంట్లపై ప‌రువు న‌ష్టం దావా వేయ‌నున్న రాధాకృష్ణ‌!

గోరంట్లపై ప‌రువు న‌ష్టం దావా వేయ‌నున్న రాధాకృష్ణ‌!

హిందూపురం వైసీపీ ఎంపీపై ఏబీఎన్ న్యూస్ ఎండీ రాధాకృష్ణ ప‌రువు న‌ష్టం దావా వేయ‌నున్నారు. గోరంట్ల మాధ‌వ్ పై క్రిమిన‌ల్, ప‌రువు న‌ష్టం చ‌ర్య‌ల‌కు రాధాకృష్ణ మీడియా ప్ర‌క‌టించింది.

గ‌త వారంలో వైసీపీ ఎంపీ వీడియో లీక్ వ్య‌వ‌హారంలో రాధాకృష్ణ మ‌రియు కొంత మంది క‌మ్మ సామాజిక వ‌ర్గ వ్య‌క్తులు వీడియో వెనుక ఉన్నార‌ని కులంతో పాటు, కొంత మంది వ్య‌క్తుల‌ను కూడా తీవ్ర ప‌ద‌జాలంతో విమ‌ర్శించారు.

ఈ రోజు అనంత‌పురం ఎస్పీ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆ వీడియో ఎడిటింగ్ చేసుండ‌చ్చు అది ఒరిజిన‌ల్ కాదని చెప్పారు. ఎవ‌రైనా భాధితులు ఉంటే పోలీసుల‌కు కంప్లైంట్ చేయాల‌న్నారు. ఎస్పీ వివ‌ర‌ణ త‌ర్వాత మీడియా తో మాట్లాడిన ఎంపీ తీవ్ర ప‌ద‌జాలంతో ఏబీయ‌న్ రాధాకృష్ణ‌తో పాటు, కొంత మంది క‌మ్మ సామాజిక వ‌ర్గ వ్య‌క్తులు వీడియోల వెనుక ఉన్నారని ఆరోపించారు.

మాధ‌వ్ మాట‌ల త‌ర్వాత ఏబీయ‌న్ రాధాకృష్ణ ప‌రువు న‌ష్టం దావా వేయ‌డం చ‌ర్చ‌నీయంశం అయ్యింది. ఎందుకంటే అలాంటి ప‌రువు న‌ష్టం దావాలు వేయాలంటే ఏబీయ‌న్ ఛానెల్ మ‌రియు అందులో ప‌ని చేసే సామాజిక వ‌ర్గ‌ యాంక‌ర్ల‌పై ఎన్ని కేసులు వేయాలో. ఎందుకంటే వారి మాట‌లు, వారి రాత‌లు ఎప్పుడూ ప‌క్క‌వారిని టార్గెట్ గానే నడుస్తుంటాయి కదా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?