Advertisement

Advertisement


Home > Politics - Gossip

గీత దాటుతున్న రఘురాముడు

గీత దాటుతున్న రఘురాముడు

తన కంపెనీల మీద సిబిఐ కన్నేసి, సోదాలు వేయడంతో కావచ్చు ఎంపీ రఘురామ కృష్ణం రాజు మనోభావాలు గట్టిగా దెబ్బతిన్నాయి. ఆ బాధలో ఆయన గీత దాటేస్తున్నారు.  ఈ నేపథ్యంలో మరో మూడు నెలల్లో ముగ్గురు కీలక వ్యక్తులు జైలు పాలు కావడం తథ్యం అంటూ ఇండైరెక్ట్ గా జగన్, విజయసాయి రెడ్డిలను ప్రస్తావించారు.

సాక్షి పెట్టుబడుల కేసు మూడు నెలల్లో తేలిపోతుందని, దాని కారణంగా సాక్షికి సంబంధించిన ముగ్గురు కీలక వ్యక్తులు జైలుకు వెళ్లబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు.

సాక్షి పెట్టుబడులకు సంబంధించి కీలక వ్యక్తుల్లో జగన్, విజయసాయి వుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. అందువల్ల రఘురామ కృష్ణంరాజు చెప్పిన ఆ ముగ్గురులో ఇద్దరు వారే అయి వుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

అంతే కాదు, ఇక్కడి డబ్బులు అక్కడికి పంపి, అక్కడి డబ్బులు ఇక్కడకు తెచ్చి, సాక్షికి పెట్టుబడుల సమీకరణలో కుంభకోణాలు జరిపారని కూడా చెప్పేసారు. 

ఇవన్నీ వింటుంటే నిన్నటికి నిన్న జరిగిన సోదాలు, వాటి నేపథ్యంలో వచ్చిన వార్తలు ఆయనను ఎంత టార్గెట్ చేసాయో అర్థం అయిపోతుంది. పాతిక వేల కోట్లకు పైగా అప్పులు (తన కంపెనీల కోసం) చేయించి కూడా ఈ రేంజ్ లో ఆయన మాట్లాడగలుగుతున్నారు అంటే నిజంగా గొప్ప విషయమే.

జగన్ కెసిఆర్ బిగ్ ఫైట్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?