Advertisement

Advertisement


Home > Politics - Gossip

ప్రభుత్వ ఖాతాలో లోకేష్ తిండి ఖర్చు.. ఆ స్థాయిలోనా?

ప్రభుత్వ ఖాతాలో లోకేష్ తిండి ఖర్చు.. ఆ స్థాయిలోనా?

ఏపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు కుటుంబం ఏ రేంజ్ లో దోచిందీ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. అప్పట్లో చంద్రబాబు నాయుడు కుటుంబం హైదరాబాద్ లో ఒక హైఫై హోటల్లో బస చేసింది. దానికి రెంటును ఏపీ ప్రభుత్వం ఖాతాలోంచి కట్టించిన ఘనతను దక్కించుకున్నారు. ఇక హైదరాబాద్ లో తన ఇళ్ల రిపేర్ల మొత్తాలను కూడా ఏపీ ప్రభుత్వం ఖాతా నుంచి డ్రా చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు అనే విమర్శలు రానే వచ్చాయి.

ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. లోకేష్ అండ్ కో తిండి ఖర్చు కూడా ఏపీ ప్రభుత్వం ఖాతాలోకే రాశారని, అది ఇప్పటికీ బకాయీగానే ఉందని వార్తలు వస్తున్నాయి. విశాఖ ఎయిర్ పోర్టులో లోకేష్ ఖాతా ఉందట. దాంట్లో భారీగా చెకోడీలు, చాక్లెట్లు తిన్నారట. ఆ బకాయీ మొత్తం పన్నెండు లక్షల రూపాయలు అని వార్తలు వస్తున్నాయి. జగన్ పై దాడి కేసులో వినిపించిన హర్షవర్దన్ చౌదరికి చెందిన ఫ్యూజన్ ఫుడ్స్ సంస్థలో లోకేష్ పేరిట ఖాతా ఉందట.

ఆ ఖాతాలో పన్నెండు లక్షల రూపాయల బకాయీ ఉందని తెలుస్తోంది. దాన్ని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. విశాఖ ఎయిర్ పోర్టులో లోకేష్ వెళ్లి ఉంటే.. గంట ఉంటాడో, రెండు గంటలు ఉండి ఉంటాడో.. అలాంటి చోటే ఏకంగా పన్నెండు లక్షల రూపాయల స్నాక్స్ బిల్లు అంటే, ఆయన ఏం తిన్నారు? ఎలా తిన్నారు? పన్నెండు లక్షల రూపాయల బిల్లు చేయడం ఏమిటో.. అంటూ ఆశ్చర్యపోతూ నెటిజన్లు పోస్టులు పెడుతూ ఉన్నారు.

జ్ఞానం రాత్రికి రాత్రి రాదు.. విద్యార్జన నిరంతర ప్రక్రియ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?