ఆస్ట్రేలియాలో ఘ‌నంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి 74వ జయంతి ని పురష్కరించుకుని ఆస్ట్రేలియా లోని ప్రధాన నగరాల్లో వైస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.  Advertisement ఈ…

దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి 74వ జయంతి ని పురష్కరించుకుని ఆస్ట్రేలియా లోని ప్రధాన నగరాల్లో వైస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. 

ఈ సందర్భంగా అన్ని ప్రధాన నగరాల్లో కేక్ లు కట్ చేసి ఆ మహనీయుని సేవలను స్మరించుకున్నారు. వివిధ రాష్ట్రాల్లోని nri కార్యవర్గ సభ్యులు ఆయా నగరాల్లో పాల్గొన్నారు. 

వైసీపీ పార్టీ నాయకులూ వెంకట్ మేడపాటి, చల్లా మధు, శిల్పా రవి, మల్లాది విష్ణు, మోదుగుల వేణుగోపాల రెడ్డి, అబ్బయ్య చౌదరి, గంగుల బ్రిజేంద్ర లు ఈ సందర్భంగా జూమ్ కాల్ ద్వారా మాట్లాడి వైస్సార్ గారి చేసిన పనులను మరొక్కసారి గుర్తు చేసుకుని, జగన్ గారు తండ్రిని మించిన పాలన అందిస్తున్నారని, అభివృద్ధి లో nri లు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైసీపీ నాయకులు రాజశేఖర్ లంకెల, శ్రీధర్ గూడ, ఇన్నారెడ్డి, విజయ్ కర్నాటి, బిజివేముల రఘు రెడ్డి, యుగంధర్ అల్లం, వంశి చాగంటి, నర్రెడ్డి ఉమా శంకర్,మర్రి కృష్ణ రెడ్డి, కందుల భరత్,గాయం శ్రీనివాస్ రెడ్డి, లెక్కల బ్రహ్మానంద రెడ్డి, బొమ్మిరెడ్డి జస్వంత్ తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.