టీడీపీకి రాజీనామాల ఫోబియా…?

ఊసుకొస్తే చాలు రాజీనామాలు చేయండి అంటూంటారు తెలుగు తమ్ముళ్లు. ఆ మాటకు వస్తే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాజీనామా డిమాండ్ ని ఈ రెండేళ్ళల్లో ఎన్నో సార్లు చేసి ఉంటారు. Advertisement ఇంతకీ…

ఊసుకొస్తే చాలు రాజీనామాలు చేయండి అంటూంటారు తెలుగు తమ్ముళ్లు. ఆ మాటకు వస్తే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాజీనామా డిమాండ్ ని ఈ రెండేళ్ళల్లో ఎన్నో సార్లు చేసి ఉంటారు.

ఇంతకీ వైసీపీ ప్రజా ప్రతినిధుల‌ రాజీనామాలు కోరుతున్న టీడీపీకి దాని వెనక కారణాలు మాత్రం చాలానే ఉన్నాయట. ప్రత్యేక హోదా ఏపీకి రాలేదని చంద్రబాబు వైసీపీ ఎంపీలను రాజీనామాలు చేయమంటే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు నిరసనగా వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని విశాఖ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

అందరం కలసి కేంద్రం మీద పోరాటం చేద్దామన్న మాట లేదు, పైగా బీజేపీని పల్లెత్తు మాటను కూడా టీడీపీ నేతలు అనరు, కానీ వైసీపీ ఎంపీలనే రాజీనామా చేయమంటున్నారని వైసీపీ నేతలు కౌంటర్లేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తాము చిత్తశుద్ధిలో చేయాల్సింది చేస్తున్నామని విశాఖ వైసీపీ ఎంవీవీ సత్యనారాయణ చెబుతున్నారు.

ఇక హోదా లాంటి విషయాల్లో టీడీపీ సర్కార్ చేయాల్సింది అన్నీ చేసి ఏపీకి డిమాండ్ చేయడానికి లేకుండా పాతరేసింది అని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ అంటున్నారు. 

గల్లీలో ఒక మాట, ఢిల్లీలో మరో మాట తాము టీడీపీ తమ్ముళ్ల మాదిరిగా మాట్లాడమని ఆయన గట్టిగానే జవాబు చెబుతున్నారు. మొత్తానికి టీడీపీకి ఈ రాజీనామాల ఫోబియా ఏంటో అని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.