Advertisement

Advertisement


Home > Politics - Political News

పొత్తు లేకపోతే ముద్ద దిగదు.. అనీల్ చెడుగుడు

పొత్తు లేకపోతే ముద్ద దిగదు.. అనీల్ చెడుగుడు

అసెంబ్లీ సాక్షిగా మరోసారి తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై సెటైర్లు దంచికొట్టారు మంత్రి అనీల్ కుమార్. సెటైర్లకు పెట్టింది పేరైన ఈ నాయకుడు, ఈరోజు సభలో టీడీపీని చెడుగుడు ఆడుకున్నారు. పార్టీ మారడం, పొత్తులపై టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు చేసిన విమర్శలకు ప్రతిగా మాట్లాడిన అనీల్ కుమార్.. పొత్తు లేకపోతే ముద్ద దిగని పార్టీగా టీడీపీని అభివర్ణించారు. 

"తెలుగుదేశం పార్టీ నెక్ట్స్ ఏ పార్టీ చంకలో ఎక్కుతుందో చెప్పాలి. బీజేపీ, సీపీఎం, సీపీఐ, జనసేన.. ఇలా ఏ పార్టీ చంకలో ఎక్కుతారో చెప్పాలి. పొత్తులేనిదే ముద్ద దిగదు మీకు. పొద్దున లేస్తే ఏ పార్టీ చంక ఎక్కుదామా, ఏ పార్టీ కాళ్లు మొక్కుదామా అని ఆలోచిస్తారు. అలాంటి టీడీపీ నేతలు కూడా పొత్తులు గురించి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి అసలు."

పొత్తుల గురించి ఆలోచించని ఏకైక పార్టీ వైసీపీ అన్నారు అనీల్. తమ పార్టీ, తమ అధినేత సింహంలా సింగిల్ గా ఎన్నికలకు వెళ్తారు తప్ప పొత్తుల గురించి ఆలోచించరని అన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గా పోటీ చేస్తుందని చెప్పే ధైర్యం ఒక్క ఎమ్మెల్యేకైనా ఉందా అని సవాల్ చేశారు అనీల్ కుమార్. ఇన్నాళ్లూ దోచుకోవడంతోనే టీడీపీ నేతలంతా బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

"చంద్రబాబుకు నవ్వడం కూడా తెలీదు. ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటాడు. కనీసం నవ్వడం నేర్చుకోండి. బీసీలు, ఎస్సీలకు అన్యాయం చేసి ఇప్పుడు వాళ్ల గురించి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. జోలి పట్టుకునే టైమ్ అయింది పొండి. మొత్తం రాష్ట్రాన్నంతా దోచుకున్నారు. ఇప్పుడు కొత్తగా జోలి పడుతున్నారు. గతంలో సెక్రటేరియట్ లో హుండీ పెట్టారు. ఆ హుండీ డబ్బులు ఎక్కడికి పోయాయో ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు జోలి పడుతున్నారు.  ఈ డబ్బులు ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలీదు. పేరుకి మాత్రం అమరావతి పరిరక్షణ." 

ఇలా ఓ రేంజ్ లో టీడీపీని, చంద్రబాబును చెడుగుడు ఆడుకున్నారు అనీల్ కుమార్. చంద్రబాబును నమ్ముకుంటే రైతులకు చివరికి ఆ గోచి కూడా మిగలదన్న అనీల్ కుమార్.. ఇకనైనా బూటకపు ఆందోళనలు, పరిరక్షణలు మానుకోవాలని టీడీపీకి సూచించారు.

కొడాలి నాని అన్న నాకోసం ప్రాణం ఇస్తాడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?