ఏపీలో అధికార మార్పిడి జరిగి దాదాపుగా రెండేళ్ల కాలం దగ్గర పడుతోంది కానీ చంద్రబాబు మాత్రం తాను ఇంకా సీఎం అన్న భ్రమల్లోనే బతుకుతున్నారని మంత్రి సీదరి అప్పలరాజు అంటున్నారు. భ్రమల నుంచి బాబు ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదని చురకలు అంటించారు.
శ్రీకాకుళం జిల్లాలో సంతబొమ్మాళిలో నంది విగ్రహాన్ని రోడ్డు మీదకు తెచ్చి తమ్ముళ్లు పెద్ద తప్పు చేస్తే దాన్ని వెనకేసుకురావడం ద్వారా అంతకంటే పెద్ద తప్పు బాబు చేశారని అప్పలరాజు హాట్ కామెంట్స్ చేశారు. మీకు దేవతా విగ్రహాలు రాళ్ళు మాదిరిగా కనిపిస్తున్నాయా అంటూ ఆయన టీడీపీ పెద్దలను నిలదీశారు.
ఈ దెబ్బతో ఏపీలో విగ్రహాల విద్వంశం వెనక ఎవరు ఉన్నారో తెలిసిపోయిందని కూడా ఆయన అన్నారు. చంద్రబాబు ఏపీలో తన రాజకీయాల కోసం దేనికైనా సిధ్ధమని చెప్పుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.
మానసిక వ్యాధిలో బాబు బాధపడుతున్నారని చెబుతున్న డాక్టర్ మంత్రి గారు ఇలాంటి వారు రాజకీయాలకు అనర్హులు అంటూ పెద్ద పదమే వాడేసారు. పనిలో పనిగా బాబుని అర్జంటుగా మానసిక వైద్యునికి చూపించాలని కూడా ఆయన టీడీపీకి ఒక సలహా ఇచ్చారు.
మొత్తానికి బాబు, ఆయన టీడీపీ విగ్రహాల రాజకీయం ఇలా బెడిసిందని వైసీపీ నేతలు అంటున్నారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు