Advertisement

Advertisement


Home > Politics - Political News

బాబు మీడియా తాట తీసిన బొత్స

వైసీపీ మంత్రి బొత్స మరోసారి ఫైర్ అయ్యారు. ఇప్పటికే చంద్రబాబు అనుకూల మీడియాపై పలుమార్లు విరుచుకుపడిన ఈ సీనియర్ నాయకుడు, ఈరోజు మరోసారి తన విశ్వరూపం చూపించారు. 

ఛానెళ్ల పేర్లు చెప్పి మరీ వాళ్లు ప్రసారం చేస్తున్న అవాస్తవాల్ని మీడియా ముందుంచారు. హై-పవర్ కమిటీ, ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు బొత్స.

అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కట్టడాలను గాలికి వదిలేస్తారనే ప్రచారంపై కూడా బొత్స తీవ్రంగా స్పందించారు. 25శాతం దాటిన నిర్మాణాల్ని కొనసాగిస్తామని, వాటిని వాడుకలోకి కూడా తీసుకొస్తామని స్పష్టంచేశారు. అమరావతి ఎప్పటికీ లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ఉంటుందని, ఇక్కడ సౌకర్యాల కోసం ఆ భవనాల్ని వాడుకుంటామని, దేన్నీ వృధాగా వదిలేయమన్నారు.

ఇక అమరావతి రైతుల ఆందోళనపై కూడా బొత్స సత్యనారాయణ స్పందించారు. కమిటీ అభిప్రాయాలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, రైతుల పట్ల జగన్ సానుకూలంగా స్పందించారని అన్నారు. రైతులకు మేలు జరిగే విధంగా, గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలకు అనుగుణంగా, అవసరమైతే అంతకంటే ఎక్కువగానే రైతులకు లబ్ది చేకూరేలా కార్యాచరణ సిద్ధంచేయమని ముఖ్యమంత్రి సూచించినట్టు తెలిపారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?