Advertisement

Advertisement


Home > Politics - Political News

అయ్యో...క‌ళ్లెదుటే కాలి బూడిద‌య్యారు!

అయ్యో...క‌ళ్లెదుటే కాలి బూడిద‌య్యారు!

క‌ళ్లెదుటే ఐదుగురు స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. ఈ విషాద దుర్ఘ‌ట‌న చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఆదివారం మ‌ధ్యాహ్నం చోటు చేసుకుంది. కారు (నెంబరు AP39HA 4003)లో మొత్తం 8 మంది ప్ర‌యాణిస్తున్నారు. చంద్ర‌గిరి మండ‌లం ఐతేప‌ల్లి వ‌ద్ద‌కు రాగానే కారులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి.

ఈ ప్ర‌మాదంలో చిన్నారితో స‌హా ఐదుగురు మంట‌ల్లో చిక్కుకుని అక్క‌డిక‌క్క‌డే కాలి బూడిద‌య్యారు. మ‌రో ముగ్గురు తీవ్ర గాయాల పాల‌య్యారు. వీరిని హుటాహుటీన తిరుప‌తి రుయా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులు మంటలార్పి కారులోని మృతదేహాలను బయటకు తీశారు. మృతులు విజయనగరం జిల్లా వాసులుగా పోలీసులు భావిస్తున్నారు.

ఈ మార్గంలో త‌రచూ రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతుంటాయి. ఈ కారు డివైడ‌ర్‌ను ఢీకొన‌డంతో మంట‌లు చెల‌రేగాయ‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్నారు. 

కారులో ఎవ‌రు, ఎక్క‌డికి, ఎందుకు ప్ర‌యాణిస్తున్నార‌నే విష‌యాల‌ను రాబ‌ట్టేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. క్ష‌త‌గాత్రుల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు కృషి చేస్తున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?