Advertisement

Advertisement


Home > Politics - Political News

ఆంద్రజ్యోతి రాధాకృష్ణ పై టిడిపి ఎమ్మెల్యే ఫైర్

ఆంద్రజ్యోతి రాధాకృష్ణ పై టిడిపి ఎమ్మెల్యే ఫైర్

ఆంద్రజ్యోతి రాదాకృష్ణపై గన్నవరం టిడిపి ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. ఆ పత్రిక రిపోర్టరు వేసిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాదానం చెబుతూ ఆంద్రజ్యోతి రాదాకృష్ణ ఎలా అబిప్రాయాలు మార్చుకున్నారని ప్రశ్నించారు.

ఈ ఎన్నికలకు ముందు ఆంద్రజ్యోతి లో ప్రదాని మోడీని, బిజెపి అద్యక్షుడు అమిత్ షా ను ఎలా దూషించారో గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు.

ఎన్నికల తర్వాత రాదాకృష్ణ ఎలా రాస్తున్నారు? అమిత్ షా ను ఎలా కలిసి వచ్చారు..మీరు అబిప్రాయాలు మార్చుకోవచ్చా? మీరు చేస్తే సంసారం..మేం చేస్తే వ్యభిచారమా అని వంశీ ప్రశ్నించారు.

తాను జగన్ కు మద్దతు ఇస్తున్నానని, త్వరలో వైసిపి లో చేరుతున్నానని ఆయన అన్నారు. నియోజకవర్గంలో మంచి చేయడానికే తాను జగన్ కు మద్దతు ఇస్తున్నానని వంశీ ప్రకటించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?