Advertisement

Advertisement


Home > Politics - Political News

మరో దారుణం... ఆటోలో బాలికపై అత్యాచారం

మరో దారుణం... ఆటోలో బాలికపై అత్యాచారం

నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేసినా కొంతమందిలో మార్పు రావడం లేదు. అత్యాచాల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో నిర్భయ తరహా ఘటన చోటుచేసుకుంది. ఓ బాలిక ఆటోలో అత్యాచారానికి గురైంది. 

బుచ్చిరెడ్డిపాలెం శివార్లలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న బాలికపై అక్కడే ఉన్న ఆటోడ్రైవర్ రసూల్ కన్నేశాడు. ఆటో ఎక్కుతావా అంటూ ప్రశ్నించాడు. బాలిక వద్దని చెప్పి నడుచుకుంటూ వెళ్తోంది. చుట్టూ గమనించిన రసూల్, ఎవ్వరూ లేరని నిర్థారించుకున్న తర్వాత బాలికను ఆటోలోకి బలవంతంగా ఎక్కించుకున్నాడు. సమీపంలోని చెట్ల మధ్యకు తీసుకెళ్లి ఆటోలోనే రేప్ చేశాడు.

బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అక్కడే వదిలేసి ఆటోలో పరారయ్యాడు. కొద్దిసేపటి తర్వాత అటుగా వచ్చిన కొంతమంది బాలికను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, స్థానికులు ఇచ్చిన సమాచారంతో గంటల వ్యవథిలోనే నిందితుడు రసూల్ ను అరెస్ట్ చేశారు.

రామోజీరావుని సూటిగా అడుగుతున్నా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?