నిమ్మగడ్డ రమేశ్కుమార్పై పంచాయతీరాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. నిన్న తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో ఉద్యోగ విరమణ చేయనున్న నిమ్మగడ్డ మాజీముఖ్యమంత్రి చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇంకా అనేక విమర్శలు నిమ్మగడ్డపై పెద్దిరెడ్డి చేశారు. మంత్రి విమర్శలపై నిమ్మగడ్డ స్పందిస్తూ ...తనపై మంత్రి విమర్శలు చేయడం బాధాకరం, అనుచితమన్నారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి , కమిషనర్పై తానెవరి ప్రాపకం కోసమో చర్య తీసుకున్నానంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు తీర్పునకు, రాజ్యాంగ స్ఫూర్తికి , ఎన్నికల నియమావళికి విరుద్ధమని నిమ్మగడ్డ నిన్న అన్నారు.
ఈ నేపథ్యంలో మరోసారి తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడికి బంట్రోతులా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వులను తాను ఉల్లంగిస్తున్నానని నిమ్మగడ్డ చెప్పడం బ్లాక్ మెయిల్ చేయటమేనని ధ్వజమెత్తారు. ద్వివేదిపైన చంద్రబాబుకు కోపం, అందుకే ఆయనపై చర్యలకు ఎస్ఈసీని ఉపయోగించుకుంటున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎస్ఈసీగా రమేశ్ ఉండటం దురదృష్టకరమన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాలకు పాల్పడి గెలిచిన వారికి రూ.10వేలు జరిమానా. 3 సంవత్సరాలు జైలు చట్టం తెచ్చామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించడం గమనార్హం. మంత్రి ఘాటు వ్యాఖ్యలపై నిమ్మగడ్డ ఎలా స్పందిస్తారో మరి!
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు