నందమూరి సుహాసిని. ఈమె దివంగత ఎన్టీఆర్ మనవరాలు, నందమూరి హరికృష్ణ కూతురు. ఈమె గురించి 2018 వరకూ ఎవరికీ తెలియదు. తెలంగాణలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా కూకట్పల్లి నుంచి పోటీ చేశారు.
దీంతో నందమూరి సుహాసిని ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో సుహాసిని ఓటమి రుచి చూడాల్సి వచ్చింది. సుహాసినిని కూకట్పల్లి నుంచి పోటీ చేసి బలి పశువు చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో మండిపడిన విషయం తెలిసిందే.
తాజాగా మరోసారి సుహాసిని పేరు వార్తల్లో నిలిచింది. కూకట్పల్లి నుంచి ఓడిపోయిన సుహాసినిని టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తు పెట్టుకుని ఓ మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ పార్టీ పదవి కావడం విశేషం. టీడీపీ ఏపీ, తెలంగాణ కమిటీలను చంద్రబాబు సోమవారం ప్రకటించారు.
ఇందులో భాగంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణనే కొనసాగిస్తున్నారు. కొత్తగా తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసినిని నియమిస్తూ ... ఆమె పేరును బాబు ప్రకటించడం విశేషం.
ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా తన కుమారుడు లోకేశ్కు పదవి కట్టబెట్టారు. అధికారంలో ఉన్నంత కాలం నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని ఏ మాత్రం పట్టించుకోని చంద్రబాబు ... ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చేసరికి ఆయన కుమార్తెను రంగంలోకి దింపారనే విమర్శలు అప్పట్లో విస్తృతంగా వచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పుడు తెలంగాణలో అసలు ఉనికే లేని పార్టీకి నందమూరి సుహాసినిని ఉపాధ్యక్షురాలిగా నియమించడం ఏంటని ఎన్టీఆర్ , హరికృష్ణ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు