Advertisement

Advertisement


Home > Politics - Political News

అంత‌న్నాడు ఇంత‌న్నాడు...చివ‌రికి ‘చేతులెత్తాడు’

 అంత‌న్నాడు ఇంత‌న్నాడు...చివ‌రికి  ‘చేతులెత్తాడు’

‘రాజ‌ధాని మార్చే మీకెవ‌రు ఇచ్చారు. ఎట్టి ప‌రిస్థితుల్లో త‌ర‌లించేందుకు వీల్లేదు. ప్ర‌జాపోరాటాన్ని నిర్మించేందుకు రాష్ట్ర‌మంతా తిరిగి జోలె ప‌డుతా. జ‌గ‌న్ న‌ర‌రూప రాక్ష‌సుడు. అత‌న్ని బ‌లి ఇవ్వాలా వ‌ద్దా?’  నిన్నమొన్న‌టి వ‌ర‌కు ఊరూరూ తిరుగుతూ ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబునాయుడు సీఎం జ‌గ‌న్‌పై  చెల‌రేగిపోయి తిట్ల వ‌ర్షం కురిపించాడు. చంద్ర‌బాబు మాట‌లు, హెచ్చ‌రిక‌లు విన్న వారు భ‌యంతోనైనా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ‘రాజ‌ధాని మార్చేందుకు జ‌గ‌న్ ముందుకు రాడు’ అని అనుకున్నారు.  మ‌రి చంద్ర‌బాబు త‌న చేతుల్లోనే రాజ‌ధాని ఉన్నంత బిల్డ‌ప్ ఇచ్చాడు. 

గ‌త నెల రోజులుగా సీఎం జ‌గ‌న్ ఎక్క‌డా రాజ‌ధానిపై మాట్లాడ‌లేదు. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌పై అసెంబ్లీలో బిల్లు ఆమోదానికి ప్ర‌త్యేక స‌మావేశాలు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ బ‌య‌ట జ‌గ‌న్‌పై వీర‌విహారం చేసిన చంద్ర‌బాబు....ఇక లోప‌ల చీల్చిచెండాడుతాడ‌ని మ‌రీ ముఖ్యంగా రాజ‌ధాని ప్రాంత రైతులు ఆశించారు. బాబు ప్ర‌సంగం కోసం ఎదురు చూశారు. 

అయితే చంద్ర‌బాబు చాలా జాగ్త‌త్త‌గా, భ‌యంగా రాజ‌ధానిపై ఆచితూచీ మాట్లాడాడు. విశాఖ అంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని కూడా చెప్పాడు. ఒక రాష్ట్రం ...ఒక రాజ‌ధాని...ఇదే టీడీపీ సిద్ధాంతమ‌న్నాడు. కేంద్రం నియ‌మించిన శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ 3 రాజ‌ధానులు పెట్ట‌మ‌ని చెప్ప‌లేదన్నాడు. విజ‌య‌వాడ‌- గుంటూరు ప్రాంతం అనువైన‌ది కాద‌నీ అన‌లేదన్నాడు. అంతే త‌ప్ప పెట్టుకోవ‌చ్చ‌ని సూచించిన‌ట్టు ధీమాగా చెప్ప‌లేక‌పోయాడు. 

విజ‌య‌వాడ -గుంటూరు క్ల‌స్ట‌ర్‌కు అనువైన ఇండెక్స్‌లో ఎక్కువ పాయింట్స్ వ‌చ్చాయని చెప్పుకొచ్చాడు. ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌లో 46 శాతం ఇక్క‌డే రాజ‌ధాని ఉండాల‌ని చెప్పారని, అన్నీ చూసిన త‌ర్వాత ఇదే స‌రైంద‌ని అనుకున్నామ‌న్నాడు. వెంట‌నే మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి క‌ల్పించుకుని కేవ‌లం 1500 మంది అభిప్రాయాల‌ను ఐదు కోట్ల ప్ర‌జ‌ల అభిప్రాయంగా ఎలా భావిస్తార‌ని ప్ర‌శ్నించాడు. దీనికి చంద్ర‌బాబు నుంచి రిప్లై లేదు. చంద్ర‌బాబు ప్ర‌సంగాన్ని బాగా గ‌మ‌నిస్తే అమ‌రావ‌తిలో కొన‌సాగించాల‌నే డిమాండ్ త‌ప్ప విశాఖ‌, క‌ర్నూల్‌పై అసెంబ్లీ బయ‌ట మాట్లాడిన‌ట్టు అవాకులు చెవాకులు పేల‌లేదు. 

ఇక చివ‌ర‌గా నాట‌కాన్నిర‌క్తి క‌ట్టించాడు. ‘ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నా కంటే వ‌య‌సులో చిన్న‌వాడైనా చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నా....తొంద‌ర‌ప‌డొద్దు...మూడు రాజ‌ధానులుగా విభ‌జించొద్దు. అమ‌రావ‌తిని కొన‌సాగించండి’  అని ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడు వేడుకుని సానుభూతి పొందేందుకు ప్ర‌య‌త్నించాడు. నెల రోజులుగా అసెంబ్లీ బ‌య‌ట రాజ‌ధాని ఆందోళ‌న పేరుతో జ‌గ‌న్‌ను అది చేస్తా, ఇది చేస్తా అని ప‌రాక్ర‌మాలు ప‌లికిన బాబు...జ‌గ‌న్ ఎదురుగా నిలిచి విశాఖ‌ను రాజ‌ధాని చేయాల‌ని ఎవ‌రు అడిగార‌ని ప్ర‌శ్నించ‌లేక‌పోవ‌డం ఆయ‌న‌కే చెల్లింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?