Advertisement

Advertisement


Home > Politics - Political News

ఢిల్లీకి కాదు.. చంద్రబాబు విదేశాలకు!

ఢిల్లీకి కాదు.. చంద్రబాబు విదేశాలకు!

పలు అంశాల గురించి చర్చించడానికి ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడుకు కూడా పిలుపు వచ్చింది. ఒకే దేశం ఒకే ఎన్నికలు సబ్జెక్టుతో పాటు పలు అంశాల గురించి పార్టీల అభిప్రాయాలను, సలహాలను సూచనలను తీసుకోవడానికి మోడీ ప్రభుత్వం అందరినీ ఆహ్వానించింది.

ముందుగా ఈ సమావేశానికి హాజరుకావడం, కాకపోవడం గురించి చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలతో చర్చించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే చివరకు మాత్రం ఈ సమావేశాన్ని చంద్రబాబు నాయుడు ఎస్కేప్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడు హాజరుకావడం లేదని, ఆయన ఢిల్లీకి వెళ్లడంలేదని, ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు కుటుంబ విదేశీ పర్యటన వాయిదా పడుతూ వస్తోందట. పోలింగ్ ముగిసిన వెంటనే జగన్ విదేశీ పర్యటన పూర్తి చేసుకువచ్చారు.

అయితే చంద్రబాబు నాయుడు అప్పుడు దేశమంతా తిరిగారు. విహారయాత్ర కాకుండా చంద్రబాబు అప్పుడు పార్టీలతో సమావేశాలకు వెళ్లారు. అవన్నీ సిష్ఫల యాత్రలు అయ్యాయి. ఇక ఇప్పుడు ఎలాగూ అసెంబ్లీ కూడా పూర్తి అయ్యింది. ఇప్పుడప్పుడే చంద్రబాబును కదిలించే వాళ్లు కూడా ఎవరూ ఉండరు అందుకే విదేశీ విహారానికి వెళ్తున్నారట!

ఆత్మవిమర్శ అవసరం.. దిక్కుతోచని స్థితిలోనే ఈ పనులు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?