Advertisement

Advertisement


Home > Politics - Political News

చిరు ట్వీట్ కెవ్వు కేక‌

చిరు ట్వీట్ కెవ్వు కేక‌

వ‌కీల్‌సాబ్ సినిమా చూసిన త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ కెవ్వు కేక అనేలా అదిరిపోయింది. మూడేళ్ల త‌ర్వాత న‌టించిన త‌న త‌మ్ముడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాను తాను కూడా అంద‌రిలాగే చూసేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న‌ట్టు చిరంజీవి రెండు రోజుల క్రితం ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో నిన్న రాత్రి చిరంజీవి త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వీక్షించారు. సినిమా చూస్తున్నంత సేపూ ఆయ‌న ఆనందానికి అవ‌ధుల్లేవ‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో వ‌కీల్‌సాబ్ మూవీపై ట్విట‌ర్ వేదిక‌గా త‌న అభిప్రాయాన్ని చిరంజీవి వెల్ల‌డించారు. సినిమాతో పాటు ప‌వ‌న్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు.

"మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్‌లో అదే వేడి, అదే వాడి, అదే ప‌వర్. ప్ర‌కాశ్ రాజ్‌తో కోర్టు రూమ్ డ్రామా అద్భుతం. అన‌న్య‌, అంజ‌లి, నివేదా థామ‌స్ వాళ్ల వాళ్ల పాత్ర‌ల‌లో జీవించేశారు. థ‌మ‌న్, డీఓపీ వినోద్ సినిమాకు ప్రాణం పోశారు. 

దిల్ రాజు, బోనీ క‌పూర్, మిగ‌తా చిత్ర బృందానికి నా శుభాకాంక్ష‌లు. అన్నింటికి మించి మ‌హిళ‌ల‌కు ఇవ్వాల్సిన గౌర‌వాన్ని తెలియ‌జేసే అత్య‌వ‌ర‌మైన చిత్రం వ‌కీల్ సాబ్. ఈ వ‌కీల్ సాబ్ కేసుల‌నే కాదు, అంద‌రి మ‌న‌సులని గెలుస్తాడు" అంటూ చిరు  ట్వీట్ చేశారు. చిరు ట్వీట్‌తో ప‌వ‌ర్‌స్టార్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?