Advertisement

Advertisement


Home > Politics - Political News

ఏపీ స‌ర్కార్‌పై కోర్టు సీరియ‌స్‌

ఏపీ స‌ర్కార్‌పై కోర్టు సీరియ‌స్‌

ఏపీ ప్ర‌భుత్వంపై హైకోర్టు మ‌రోసారి సీరియ‌స్ అయ్యింది. వివిధ అంశాల‌పై న్యాయ‌ప‌రమైన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డంతో ప్ర‌భుత్వం నిత్యం న్యాయ‌స్థానంలో మొట్టికాయ‌లు తింటుండాన్ని చూస్తున్నాం. 

ఇటీవ‌ల టీటీడీ పాల‌క మండలిలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా 52 మందిని ప్ర‌త్యేక ఆహ్వానితులుగా నియ‌మిస్తూ ఇచ్చిన జీవోల‌పై హైకోర్టు స్టే ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఉపాధిహామీ ప‌థ‌కానికి సంబంధించి నిధుల‌ను చెల్లించ‌క‌పోవ‌డంపై కూడా కోర్టు ప‌లుమార్లు ఆగ్ర‌హించింది.

తాజాగా ఆ కోవ‌లోకి ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న మ‌రో నిర్ణ‌యం చేరింది. ఎయిడెడ్ విద్యాసంస్థ‌ల‌ను త‌న ఆధీనంలోకి తీసుకుంటూ ప్ర‌భుత్వం జీవో జారీ చేయ‌డాన్ని ఏపీ హైకోర్టు త‌ప్పు ప‌ట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటూ జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ విద్యాసంస్థల అసోసియేషన్లు హైకోర్టులో ప‌లు వ్యాజ్యాలు దాఖ‌లు చేశాయి. వీటిపై హైకోర్టు శుక్ర‌వారం విచారణ జరిపింది.  

విచారణలో భాగంగా పిటిషనర్‌ ప్రొసీడింగ్స్‌ను ప్రధాన న్యాయమూర్తి చదివి వినిపించారు. ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే విషయం కనపడుతోందని ధర్మాసనం అభిప్రాయప‌డింది. 

ప్రభుత్వంలోకి తీసుకొనేందుకు అంగీకరించిన విద్యాసంస్థల నుంచి మాత్రమే అంగీకారపు పత్రాలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మరో విధంగా జరగుతున్నట్లు తెలుస్తోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇది స‌రైంది కాద‌ని న్యాయ‌స్థానం పేర్కొంది.

ఎయిడెడ్‌ విద్యాసంస్థల అంగీకారాన్ని బలవంతంగా తీసుకుంటున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది విజయ్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అధికారులకు కడప డీఈవో జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను పిటిషనర్‌ ధర్మాసనం ముందు ప్రవేశపెట్టారు. 

పిటిష‌న‌ర్ అభిప్రాయం విన్న న్యాయ‌స్థానం ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ నెల 29న డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ధర్మాసనం ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ...కేసును ఆ రోజుకి వాయిదా వేసింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?