Advertisement

Advertisement


Home > Politics - Political News

చంద్రబాబును అసెంబ్లీకి వెళ్లవద్దన్నారట!

చంద్రబాబును అసెంబ్లీకి వెళ్లవద్దన్నారట!

చంద్రబాబుకు జనాల పరామర్శల యాత్రలు కొనసాగుతూ ఉన్నాయట. సాధారణంగా రాజకీయ నేతలు జనాలను పరామర్శించడానికి వస్తారో. అయితే చంద్రబాబుకు మాత్రం జనాల పరామర్శ యాత్రలు సాగుతూ ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి నెలలు గడిచిపోతున్నా చంద్రబాబును పరామర్శించే వాళ్లు మాత్రం కొనసాగుతూ ఉన్నారట!

'మీరు ఓడిపోవడం ఏమిటయ్యా..' అనే ఆ ప్రోగ్రామ్ ఇంకా కొనసాగుతూ ఉందన్నమాట. ఆ విషయంలో నవ్వులపాలవుతున్నా తెలుగుదేశం పార్టీ ఆ ఎపిసోడ్స్ ను కొనసాగిస్తూ ఉంది. అందులో భాగంగా తాజాగా కొంతమంది రైతులు వెళ్లి చంద్రబాబు నాయుడు పరామర్శించారట. అంతేకాదు.. వారు చంద్రబాబుకు కొన్ని సూచనలు కూడా ఇచ్చారట.

'మీరు అసెంబ్లీకి వెళ్లవద్దు..' అని వారు చంద్రబాబు నాయుడుకు సూచన చేశారట! అసెంబ్లీలో చంద్రబాబును ఒంటరిని చేసి జగన్ ఇబ్బంది పెడుతూ ఉన్నారని, అందుకే ఇక నుంచి చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వెళ్లవద్దని వారు వారించారట!

ఇప్పటికే చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి డుమ్మాకొట్టిన సంగతి తెలిసిందే. బడ్జెట్ సమావేశాల సమయంలో చంద్రబాబు నాయుడు అమెరికా వెళ్లారు. అసెంబ్లీ సాగుతున్నా చంద్రబాబు నాయుడు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారు. అమెరికాలో పాప్ కార్న్ తింటూ కనిపించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడును పరామర్శిస్తున్న వారు కూడా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఇరకాటంలో పడిపోవడాన్ని తట్టుకోలేక సభకే పంగనామం పెట్టమని సూచించారట.

వెనుకటికి అసెంబ్లీలో ఫిరాయింపులను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభను బహిష్కరిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్లు చెప్పని నీతులంటూ లేవు. తాము అనైతిక రాజకీయం చేస్తూ వాళ్లు జగన్ కు నీతులు చెప్పారు. ఇప్పుడు జగన్ ఫిరాయింపులు చేయించకపోయినా తెలుగుదేశం ముందుగానే సభకు డుమ్మాకొట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా ఉందని పరిశీలకులు అంటున్నారు.

జగన్నాటకంలో మంత్రులకు సీన్‌ సితారే?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?