Advertisement

Advertisement


Home > Politics - Political News

మరదలిపై లైంగిక దాడి.. ఫేస్ బుక్ లో న్యూడ్ ఫొటోలు

మరదలిపై లైంగిక దాడి.. ఫేస్ బుక్ లో న్యూడ్ ఫొటోలు

భార్య కాపురానికి పనికిరాదని, ఆమె చెల్లెలిపై కన్నేశాడు ఓ కీచకుడు. ఆమెను లైంగికంగా వేధించాడు. ఒక రోజు కాదు, ఒక నెల కాదు... ఏకంగా 8 ఏళ్ల పాటు నరకం అనుభవించింది ఆ అమ్మాయి. ఇక భరించలేక స్పందన ఆఫీస్ లో ఫిర్యాదు చేసింది. గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది ఈ దారుణం.

కొల్లూరుకు చెందిన రవికిరణ్, అదే ప్రాంతానికి చెందిన అమ్మాయిని 2010లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన కొన్నాళ్లకే భార్య అనారోగ్యానికి గురైంది. అప్పుడే భార్య చెల్లెలిపై కన్నేశాడు రవికిరణ్. ఇంటి పనుల కోసమని మరదల్ని ఇంటికి తీసుకొచ్చి అఘాయిత్యానికి పాల్పడేవాడు. బయటకు చెబితే అక్క జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించేవాడు.

అలా 15 ఏళ్ల వయసు నుంచి భార్య చెల్లెలిపై అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నాడు రవికిరణ్. రెండేళ్ల కిందట ఓ గుడికి తీసుకెళ్లి బలవంతంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో రెండో కాపురం కూడా పెట్టాడు. అయితే కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో అసలు విషయాన్ని బయటపెట్టాడు.

ఆ తర్వాత కూడా రవికిరణ్ ఆగడాలు తగ్గలేదు. భార్య చెల్లల్ని నగ్నంగా ఫొటోలు తీసి ఫేస్ బుక్ లో పెడతానని బెదిరించడం ప్రారంభించాడు. మరోవైపు అనారోగ్యంతో ఉన్న భార్యను కూడా చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. దీంతో విసిగిపోయిన ఆ యువతి.. గుంటూరు రూరల్ ఎస్పీ స్పందన ఆఫీస్ కు ఫిర్యాదు చేసింది.

యువతి ఫిర్యాదు మేరకు రవికిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి మొబైల్ నుంచి యువతి ఫొటోల్ని డిలీట్ చేశారు. సోషల్ మీడియాలో ఎక్కడైనా పోస్ట్ చేశాడా అనే అంశంపై ఆరా తీస్తున్నారు.

రష్మిక లెగ్గుతో నితిన్ కి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?