ఇది విన్నారా? కన్నారా? ఇంతకూ అసలు సంగతి ఏంటనే కదా మీ ప్రశ్న. అక్కడికే వెళ్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఇప్పటికిప్పుడు ఈ ఆంధ్రా రాజకీయాలు వద్దు అని యూఎస్ వెళితే... ఆయన ఆదాయం ఎంతో తాజాగా తెలిసిపోయింది.
లోకేశ్ యూఎస్ వెళితే ....ఆయనకు వచ్చే ఆదాయం అక్షరాలా రూ.50 లక్షల డాలర్లు. ఇది పచ్చి నిజం. ఈ విషయాన్ని టీడీపీ నాయకురాలు దివ్య వాణి అందించిన బ్రేకింగ్ న్యూస్. లోకేశ్పై మంత్రి కొడాలి నాని ఘాటు విమర్శల్ని దివ్య వాణి తట్టుకోలేక పోతున్నారు. నానికి కౌంటర్ ఇచ్చే మగాళ్లెవరూ గుడివాడలో లేనట్టున్నారు.
నెల క్రితం కూడా కొడాలి నానికి కౌంటర్ ఇవ్వడానికి దివ్య వాణి రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ మరోసారి ఆమె మీడియా ముందుకొచ్చారు. లోకేశ్ను విమర్శించే వారికి ఆవగింజలో అరవయ్యో వంతు అర్హత ఉందా అని ఆమె గట్టిగా ప్రశ్నించారు. ఎంబీఏ చదివిన లోకేశ్ ప్రపంచబ్యాంకులో పని చేసిన రికార్డు సొంతం చేసుకున్నట్టు దివ్యవాణి తెలిపారు.
‘ఏమండోయ్ కొడాలి గారు.. పుట్టుకతో బంగారు స్ఫూన్తో పుట్టిన వ్యక్తి లోకేశ్. పార్టీలు మార్చే వ్యక్తి కాదు. వీళ్లకు వాళ్లకు గ్లాసులు మోసిన వ్యక్తి కాదు. సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారే వ్యక్తి కాదు. ఇవన్నీ ఎందుకని ఆయన యూఎస్కు వెళితే... వచ్చే ఆదాయం ఎంతో తెలుసా... 50 లక్షల డాలర్లు సంపాదించుకొనే సత్తా ఉంది’ అని చెప్పుకొచ్చారు.
పాపం దివ్యవాణికి తెలియని సంగతేంటంటే ...చంద్రబాబునాయుడు కూడా పార్టీ మారారని. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు , ఆయన రాజకీయ భవిష్యత్పై నమ్మకం లేకనే ఆ పార్టీలోకి చేరలేదు.
ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వచ్చిందో ... ఆ వెంటనే కాంగ్రెస్ నుంచి జంప్ అయ్యారు. ఈ విషయాలేవీ ప్రజలకు తెలియదనే భావన వల్ల కావచ్చు ...నాని పార్టీ మారడంపై దివ్య వాణి పెద్దపెద్ద విమర్శలు చేశారు. ఏమండోయ్ దివ్యవాణి గారు...మీకు వినిపిస్తోందా? అర్థమవుతోందా?
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు