Advertisement

Advertisement


Home > Politics - Political News

విశాఖకే ఓటు అంటున్న జగన్?

విశాఖకే ఓటు అంటున్న జగన్?

విశాఖ విషయంలో ముఖ్యమంత్రి జగన్ తన అభిమానాన్ని మరో మారు చాటుకున్నారు. విశాఖలో బీచ్ ఫ్రంట్ ప్రాజెక్టులకు తాజాగా ఆమోద ముద్ర వేయడం ఇందులో భాగంగా చూడాలి.

అదే విశాఖ నుంచి భోగాపురం వరకూ ఉన్న ప్రాంతంలో ఆరు లైన్ల రోడ్లు వస్తాయి. అలాగే ఈ ప్రాంతం పరిధిలో ఉన్న బీచ్ లను అభివృద్ధి చేసి అనేక టూరిజం ప్రాజెక్టులని ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించడం విశేషం.

మరో వైపు చూస్తే కోస్టల్ జోన్ లోని  అయిదు ఎకరాల్లో స్కై టవర్ల నిర్మాణం చేపడతారు అంటున్నారు. ఇక విశాఖ బీచ్ కారిడార్ ని అభివృద్ధి చేయడం ద్వారా రానున్న రోజుల్లో ఈ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మార్చేలా చర్యలు తీసుకుంటున్నారు. తొలి దశలో మొత్తం అయిదు వందల కోట్లకు పైగా ఈ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయాలని కూడా నిర్ణయించారు.

విశాఖను రాజధానిగా ప్రభుత్వం చట్టం చేసింది అది న్యాయ వివాదాలో ఉంది. అదే సమయంలో విశాఖ అభివృద్ధికి  పెద్ద పీట వేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. 

వైసీపీ సర్కార్ ఆలోచనలు అమలు అయితే ఏపీకి టూరిజం ద్వారానే అతి పెద్ద ఆదాయం వస్తుందని అంటున్నారు. మొత్తానికి విశాఖను క్యాపిటల్ చేయడం వెనక జగన్ ఆలోచనలు సక్రమమైనవే అని భావితరాలు భావించేలా కొత్త ప్రాజెక్టులు పెద్ద ఎత్తున  విశాఖకు తరలిరానున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?