Advertisement

Advertisement


Home > Politics - Political News

సాగునీటి పారుద‌ల‌లో మేఘా స‌రికొత్త చ‌రిత్ర‌!

సాగునీటి పారుద‌ల‌లో మేఘా స‌రికొత్త చ‌రిత్ర‌!

తెలంగాణా వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మొదలుపెట్టిన నాటి నుండీ రికార్డులు సృష్టిస్తోంది మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్  ఫ్రా స్ట్ర‌క్చ‌ర్స్ లిమిటెడ్ సంస్ద. నిర్మాణ పనులు ప్రారంభించిన మూడేళ్ళలోనే లింక్-1, లింక్-2లో ఎత్తి పోతల కేంద్రాలు వినియోగంలోకి తీసుకురావడంలో ఇంజనీరింగ్ అద్భుతాలు చేసిందని చెప్పుకోవచ్చు. కాళేశ్వరంలోని అత్యధిక పంపింగ్ కేంద్రాలను ఎంఈఐఎల్ పూర్తి చేసింది. మొత్తం 22పంపింగ్ కేంద్రాల్లో 96 మెషిన్లు 4680 మెగావాట్ల సార్ద్యంతో నిర్మిస్తుండగా అందులో 17కేంద్రాలలో 89మెషిన్లను 3840 మెగావాట్ల సామర్ద్యంతో నిర్మిస్తోంది ఎంఈఐఎల్ సంస్ద.

ఈ ప్రాజెక్ట్ లో కేవలం నాలుగేళ్ళలో దాదాపు 4వేల మెగావాట్ల సామర్ద్యం కల్గిన పంప్ హౌస్ లను నిర్మించడమే కాకుండా వాటిని పంపింగ్ ద్వారా వినియోగంలోకి తీసుకురావడం ద్వారా మరో ఘనత సాధించింది.ఈ ప్రక్రియలో సిఎం కేసీఆర్ పట్టుదల,నీటిపారుదల శాఖ నిరంతర పర్యవేక్షణకు తోడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ సంస్దలు బీహెచ్ఈఎల్,ఆండ్రిజ్, జైలం, ఏబిబి, క్రాంప్టన్ గ్రేవ్స్, వెగ్ లాంటి సంస్దలు భాగస్వామ్యం పంచుకున్నాయి.  కాళేశ్వరం బహుళ ఎత్తిపోతల పథకంలో భాగంగా మేఘ ఇంజనీరింగ్ ఇన్  ఫ్రా స్ట్ర‌క్చ‌ర్స్ లిమిటెడ్ నిర్మించిన కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు శుక్రవారం ప్రారంభించారు. దీని ద్వారా 3763  మెగావాట్ల  పంపింగ్ సామర్థ్యం వినియోగంలోకి వచ్చింది.

రికార్డు సమయంలో 3763 మెగావాట్లు 

నీటిపారుదల రంగంలో దాదాపు 600 అడుగుల ఎత్తుకు నీటిని పంప్ చేసే విధంగా ప్యాకేజి 14లోని పంప్ హౌస్ ను వినియోగంలోకి తీసకురావడం,దీని ద్వారా 3763 మెగావాట్ల పంపింగ్ సామర్ద్యం అందుబాటులోకి తీసుకురావడం ఇంజనీరింగ్ చరిత్రలో ఓ అద్భుతం. సాగునీటి అవసరాల కోసం ప్రపంచంలో ఇప్పటి వరకు అమెరికాలోని కొలరాడోలో మాత్రమే భారీ ఎత్తిపోతల పధకం ఉంది. ఆ తర్వాత లిబియాలోని గ్రేట్ మ్యాన్మేడ్ రివర్ రూపుదిద్దుకుంది. వీటిన్నింటితో పోలిస్తే ఆంద్రప్రదేశ్ లోని హంద్రీ-నీవా ఎత్తిపోతల పధకం పెద్దదికాగా దానితో పోలికలేని స్దాయిలో భారీ బహుళ తాగు, సాగు నీటి పధకంగా కాళేశ్వరం ప్రపంచ ప్రసిద్ది చెందింది అంటున్నారు ఇంజనీరింగ్ నిపుణులు. ఉపరితంపై కేవలం రిజర్వాయర్ల నిర్మాణం,కాలువల తవ్వకానికే దశాబ్దాలు పడుతున్న ఈకాలంలో పూర్తిగా ఎలక్ట్రో మెకానికల్ సంక్లిష్టలతో కూడిన పైగా అనేక పనులు భూగర్భంలో చేపట్టిన కాళేశ్వరం మాత్రం నాలుగేళ్ళలోనే పూర్తి చేసి వండర్స్ క్రియేట్ చేసింది ఎంఈఐఎల్. 

అత్యధిక పంపింగ్ కేంద్రాలను నిర్మించిన ఎంఈఐఎల్ 

మొత్తం పంపింగ్ కేంద్రాల్లో రోజుకు 2 టిఎంసిల నీటిని పంప్ చేసేవిధంగా నిర్మించిన కేంద్రాల్లో 3840మెగావాట్ల సామర్ద్యంతో మొత్తం 15కేంద్రాలను ఎంఈఐఎల్ నిర్మించింది. వీటిలో 9 కేంద్రాలు వినియోగంలోకి రాగా మరో నాలుగు పంపింగ్ కేంద్రాలు ఎంఈఐఎల్ పరంగా పంపింగ్కు సిద్ధంగా ఉన్నాయి. మరో రెండు పంపింగ్ కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పటివరకు పూర్తయిన పంపింగ్ కేంద్రాలు 3763 మెగావాట్ల సామర్థ్యం వినియోగంలోకి వచ్చింది. 35.4 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపింగ్ కేంద్రాలు పూర్తయ్యాయి. మరో 41 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2 పంపింగ్ కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. మొత్తం మీద మేఘా ఇంజనీరింగ్ రోజుకు 2 టీఎంసీల సామర్థ్యం కింద 3840 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పనులను చేపట్టింది. పంపింగ్ కేంద్రాల్లో ఎక్కువ భాగం మరియు అత్యధిక సామర్ద్యం గలవి భూగర్భంలో నిర్మించినవే. వీటిలో ఎంఈఐఎల్గ్ నిర్మించిన గాయత్రి (ప్యాకేజ్-8), అన్నపూర్ణ (ప్యాకేజ్-10), రంగనాయక సాగర్ (ప్యాకేజ్-11), మల్లన్నసాగర్ (ప్యాకేజ్-12) భూగర్భంలో నిర్మించినవే. ఇందులో ప్రధానంగా గాయత్రి పంప్హౌస్ నిర్మాణం కోసం భూగర్భంలో 2.3 ఘనప మీటర్ల మట్టిని తొలిసి బయటకు తీసింది. ఈ పంపింగ్ కేంద్రం వైశాల్యం 84753.2 చదరపు అడుగులు. దీనికి సంబంధించిన సర్జ్పూల్, అదనపు సర్జ్పూల్స్ కూడా ప్రపంచంలోనే పెద్దవి. 

ఈ ప్రాజెక్ట్లో లింక్-1, లింక్-2 పంప్హౌస్లు చాలా కీలకమైనవి. లింక్-1లో ప్రాణహిత జలాలను గోదావరిలోకి అంటే శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి జలాశయంలోకి తీసుకురావడం. గోదావరిని దిగువ నుంచి ఎగువకు తిరుగు ప్రయాణం చేసే విధంగా పంపింగ్ చేయడం కోసం 1120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు పంప్హౌస్లను 28 మిషన్లతో ఏర్పాటు చేశారు. అవి లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం), పార్వతి (సుందిళ్ల) పంపింగ్ కేంద్రాలు. ఆ తర్వాత ప్యాకేజ్-8 పంపింగ్ కేంద్రం గాయత్రి. ప్రపంచంలోనే అతిపెద్దది - గాయత్రి భూగర్భంలో 470అడుగుల దిగువన నిర్మించిన గాయత్రి(ప్యాకేజి-8)పంపింగ్ కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్దది.జంట టన్నెల్స్ తో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద సర్జిపైల్స్ ఇందులోని ప్రత్యేకత.ఆ అల్ట్రా మెగా ప్రాజెక్టులో 139 మెగావాట్ల సామర్ద్యం గల 7మెషిన్లతో రోజుకు 2టిఎంసిల నీటిని పంపింగ్ చేయగల సామర్ద్యం తో ఏర్పాటు చేశారు.ఈ మెషిన్లను కంప్యూటేషనల్ ప్యూయిడ్ డైనమిక్స్ (సీఎఫ్డీ) టెక్నాలజీతో దేశంలో తయారు చేసి మేక్ ఇన్ ఇండియాకు ప్రతిరూపం .ఈ పంపింగ్ కేంద్రంలో నిర్మించిన సర్జ్ పూల్స్ ఈఫిల్ టవర్ కన్నా పొడవులో పెద్దది.ఒక్కొక్కటి సుమారు 3వేల క్యూసెక్కుల నీటిని 111 మీటర్ల ఎగువకు పంప్ చేసే విధంగా భూగర్భంలో నిర్మించింది ఎంఈఐఎల్.బీహెచ్ఈఎల్ సహకారంతో మేఘా సృష్టించిన మహాద్భుతం.ఇంజనీరింగ్ వండర్.ఒక్కో మిషన్ సామర్ద్యం పరంగా చూస్తే ప్రపంచంలో ఇదే పెద్దది.7మిషన్ ల సామర్ద్యం చూసినా కూడా ఇంత పెద్ద పంపింగ్ కేంద్రం ప్రపంచంలో ఇంత వరకు ఎక్కడా పూర్తికాలేదు. 470 అడుగుల దిగువన 327 మీటర్లు పొడవు, 25 మీటర్ల వెడల్పు, 65 మీటర్ల ఎత్తుతో ఈ పంప్ హౌస్ నిర్మాణం అంటే అది ఎంత పెద్దదో ఊహించవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో 2 టిఎంసీల నీటి పంపింగ్కు గాను మొత్తం 4680 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం కలిగిన కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా అందులో ఎంఈఐఎల్ ఏర్పాటు చేస్తున్న 89 మిషన్లు 3840 మెగావాట్ల సామర్థ్యం కలిగినవి మేఘానే ఏర్పాటు చేస్తుందంటే కాళేశ్వరంలో మేఘా పాత్ర ఏంటో అర్థం చేసుకోవచ్చని ఎంఈఐఎల్ డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 

రంగనాయక సాగర్ లో రెండో అత్యధిక సామర్థ్యం 

ప్యాకేజ్-11లోని రంగనాయక సాగర్లో ఒక్కొక్కటి 134 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4 మిషన్లు ఏర్పాటయ్యాయి. ఇక్కడ 4 యూనిట్ల ద్వారా 536 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం ఏర్పాటయ్యింది. ఒక్కొక్క మిషన్ సామర్థ్యం వారిగా పరిశీలిస్తే గాయత్రి పంప్హౌస్ మిషన్ తర్వాత రంగనాయక సాగర్ (ప్యాకేజ్-11) ప్రపంచంలో రెండవ అతిపెద్ద సామర్థ్యం తో 2వ సామర్థ్యం కలిగిన పంపింగ్ యూనిట్ పేరుగాంచింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల్లో పాలుపంచుకోవడం మేఘా ఇంజనీరింగ్ అదృష్టం అంటున్నారు ఆ సంస్ద డైరెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి.ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజల నీటికష్టాలను తీర్చేందుకు,బీడు భూములను సశ్యశ్యామలం చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీతో ప్రాజెక్టు ను సకాలంలో పూర్తిచేయడం మాకు లభించిన జీవితకాలపు గౌరవంగా భావిస్తున్నాం అంటున్నారాయన.ఇదంతా సిఎం కేసీఆర్ పట్టుదల నిరంతర పర్యవేక్షణ,నేరుగా యంత్రాంగంతో ప్రతి అంశం చర్చించి ప్రోత్సహించడం వల్లనే అతితక్కువ కాలంలోనే ప్రపంప ప్రస్దిద్దిగాంచిన అతిపెద్ద ప్రాజెక్ట్ ను పూర్తిచేయగలిగామని అంటున్నారు బి.శ్రీనివాసరెడ్డి. సాగునీటి రంగంలో అందులోనూ ఎత్తిపోతల పథకం కోసం ఇంతపెద్ద స్థాయిలో పంపింగ్ కేంద్రాలను అత్యధిక మెగావాట్ల సామర్థ్యం కలిగిన మిషన్లను ఏర్పాటు చేయడం ఈ పథకం ద్వారా ప్రపంచ రికార్డ్ను తెలంగాణ నీటి పారుదల శాఖ సొంతం చేసుకుంది. 

ప్రపంచంలో ఇంతకుముందెన్నడూ ఇంతటి భారీ పంపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. భారీ విద్యుత్ వ్యవస్థ కాళేశ్వరం ఎత్తిపోతల పధకంలో అతిపెద్ద విద్యుత్ సరఫరా వ్యవస్దను ఏర్పాటు చేసి వండర్ క్రియేట్ చేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్ద.ఇది ఎంత పెద్ద విద్యుత్ వ్యవస్ద అంటే ప్రాజెక్టుకు మొత్తం 4680మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా మేఘా సంస్ద ఒక్కటే 3840మెగా వాట్ల విద్యుత్ సరఫరా వ్యవస్దను ఏర్పాటే చేసి తెలంగాణా రాష్ట్ర విద్యుత్ సరఫరా 15087 మెగావాట్లు ఉంటే అందులో 25శాతం విద్యుత్ సరఫరా వ్యవస్దను అతితక్కువ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసి రికార్డు సృష్టించింది. ఇది మొత్తం 7ఈశాన్య రాష్ట్రాల విద్యుత్ సరఫరా సామర్ద్యం(3916మెగావాట్లు)కు సమానం. మరోవైపు కాళేశ్వరం పంపింగ్ సామర్థ్యం మరో టిఎంసీ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా లింక్-1లోని లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంపింగ్ కేంద్రాల్లో 15 మిషన్లను ఒక్కొక్కటి 40 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనిని ఎంఈఐఎల్ చేస్తోంది. వీటి సామర్థ్యం 600 మెగావాట్లు. జైలం, ఆండ్రిజ్ సంస్థలు ఇందులో భాగస్వామ్యమయాయి. మిడ్ మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు కూడా అదనపు టిఎంసీ నీటి పనులను ప్రభుత్వం ఖరారు చేసే దశలో ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?