Advertisement

Advertisement


Home > Politics - Political News

అయోధ్య.. ఇంకా అయిపోలేదు!

 అయోధ్య.. ఇంకా అయిపోలేదు!

అయోధ్య వివాదస్పద స్థలంపై సుప్రీం  కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై తాము సంతృప్తిగా లేనట్టు ప్రకటించింది ముస్లిం పర్సనల్ లా బోర్డు. షరియా చట్టానికి భిన్నంగా సుప్రీం కోర్టు తీర్పు ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ ను దాఖలు చేయబోతున్నట్టుగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించింది.

నెల రోజుల్లోపే ధర్మాసనం తీర్పుపై రివ్యూ పిటిషన్ ను  దాఖలు చేయబోతున్నట్టుగా తెలిపింది. ఈ నేపథ్యంలో అయోధ్య అంశం ఇంకా తేలిపోలేదని అనుకోవాల్సి వస్తోంది.

అయితే ఈ రివ్యూ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం మళ్లీ స్వీకరిస్తుందా? ఇప్పటికే దాదాపు తొమ్మిదేళ్ల పాటు సుప్రీం ధర్మాసనం ఈ కేసును విచారించింది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ రివ్యూ పిటిషన్ ను విచారించాలంటే మరెంత కాలం పడుతుంది? అనేది సమాధానం లేని ప్రశ్నలే.

అయోధ్య తీర్పును మొదట ముస్లిం వర్గాలు స్వాగతించాయి. అయితే రాజకీయంగా ఈ వివాదం పరిష్కారం కావడం కొందరికి నచ్చడం లేదు. దీంతో మళ్లీ కథను  మొదటకు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే రివ్యూ పిటిషన్ ను ధర్మాసనం తిరస్కరించి, ఇటీవలి తీర్పుపై స్టే విధించకపోతే.. మాత్రం కథ ముగిసినట్టే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?