Advertisement

Advertisement


Home > Politics - Political News

స్పందించ‌ని న‌మ్ర‌తా..టీమ్ ఖండించింద‌ట‌!

స్పందించ‌ని న‌మ్ర‌తా..టీమ్ ఖండించింద‌ట‌!

బాలీవుడ్ డ్ర‌గ్స్ స్కాండల్ లో అనూహ్యంగా న‌మ్ర‌తా శిరోద్క‌ర్ పేరు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంలో న‌మ్ర‌త చాట్ చేసిన‌ట్టుగా వార్తా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. పేర్ల‌కు సంబంధించిన కోడ్ లాంగ్వేజ్ ల‌తో వారు న‌మ్ర‌త డ్ర‌గ్స్ గురించి చాట్ చేసిన‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. అలాగే మ‌రో ప్ర‌ముఖ న‌టి దియా మీర్జా పేరు కూడా ఈ వ్య‌వ‌హారంపై వినిపిస్తూ ఉంది. న‌మ్ర‌తా, దియా ల పేర్లు ఒకేసారి తెర మీద‌కు వ‌చ్చాయి. 

ఇలాంటి నేప‌థ్యంలో దియా మీర్జా స్పందించింది. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లను ఆమె ఖండించింది. త‌న పేరు మీద జ‌రుగుతున్న ప్ర‌చారం గురించి చ‌ట్ట‌ప‌రంగా పోరాడ‌టానికి రెడీ అని ఆమె ప్ర‌క‌టించింది. 

ఇలాంటి ప్ర‌క‌టన ఏదీ న‌మ్ర‌త వైపు నుంచి రాలేదు. ఇన్ స్టాగ్ర‌మ్ లో న‌మ్ర‌త యాక్టివ్ గా ఉంటుంది. ఈ స్కాండల్ లో ఆమె పేరు వినిపించ‌క మునుపు ఒక పోస్టు ప్ర‌చురితం అయ్యింది ఆమె అకౌంట్ నుంచి. దాని కింద ఆమె ఫాలోయ‌ర్లు డ్ర‌గ్స్ ఉదంతంపై వ‌చ్చిన వార్త‌ల‌ను ప్ర‌స్తావిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో హ‌ద్దుల్లేని కామెంట్లు పెట్టే వాళ్లు కూడా న‌మ్ర‌త పోస్టు కింద తీవ్ర కామెంట్లు చేస్తున్నారు.

ఆమెకు నీతులు చెప్పే వాళ్లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నార‌క్క‌డ‌. నిజానిజాలు ఏమిటో తెలుసుకోకుండా స్పందించ‌డ‌మే సోష‌ల్ మీడియా మార్కు స్పంద‌న‌. ఈ విష‌యంలోనూ వారు అలాగే స్పందిస్తున్నారు. త‌న భ‌ర్త ఇమేజ్ ను న‌మ్ర‌త దెబ్బ‌తీసిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ విష‌యంలో న‌మ్ర‌త అధికారికంగా స్పందించాల్సి ఉంది.

వ్యవస్థను కాపాడాల్సిన కోర్టే ఇలా చేస్తే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?