Advertisement

Advertisement


Home > Politics - Political News

పిల్లల్ని కందాం రా.. వృద్ధ రసికుడి వేధింపులు

పిల్లల్ని కందాం రా.. వృద్ధ రసికుడి వేధింపులు

ప్రేమించుకుందాం రా.. పెళ్లి చేసుకుందాం రా అని వెంటపడే వాళ్లను చూశాం కానీ ఇలా పిల్లల్ని కందాం రా అని వేధించే వాడిని మాత్రం ఫస్ట్ టైమ్ చూస్తున్నాం. అది కూడా 65 ఏళ్ల వృద్ధుడు ఈ వేధింపులకు పాల్పడ్డం ఇక్కడ కొసమెరుపు. హైదరాబాద్ లో ఈ అరాచకం చోటుచేసుకుంది.

ఖైరతాబాద్ లోని ఆనంద్ నగర్ కాలనీలో ఉంటున్న స్వరూపరాజు అనే వ్యక్తికి ముగ్గురు ఆడపిల్లలు. తన వంశాన్ని నిలబెట్టే మగ పిల్లాడు లేడని అతడు నిత్యం బాధపడేవాడు. ఈ క్రమంలో వైద్యుల్ని సంప్రదించి సరోగసీ ద్వారా మగ పిల్లాడ్ని కనాలని భావించాడు. ఈ మేరకు నూర్ అనే మధ్యవర్తి స్వరూపరాజుకు పరిచయమయ్యాడు.

నూర్ ద్వారా 22 ఏళ్ల మహిళ, స్వరూపరాజ్ కు పరిచయమైంది. సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆమె అంగీకరించింది. నాలుగున్నర లక్షలకు ఒప్పందం కుదరడంతో పాటు.. నెలకు ఖర్చుల కింద 10 వేల రూపాయలు ఇవ్వడానికి స్వరూపరాజు అంగీకరించాడు. అయితే ఒక రోజు రాత్రి స్వరూపరాజుకు ఓ చిలిపి కోరిక కలిగింది..

సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చే బదులు.. నేరుగా సదరు మహిళ ద్వారా బిడ్డను కనాలని అనుకున్నాడు ఈ వృద్ధుడు. అంతే.. అనుకున్నదే తడవుగా వెంటపడడం మొదలుపెట్టాడు. తన ద్వారా, సహజంగానే బిడ్డను కనివ్వాలని, సదరు మహిళను వేధించడం మొదలుపెట్టాడు. ఇంతకుముందు అనుకున్న మొత్తం కంటే ఇంకాస్త ఎక్కువే ఇస్తానని ఊరించాడు. 

రోజురోజుకు వేధింపులు ఎక్కువవ్వడంతో మహిళ, తన భర్త సహాయంతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వృద్ధ రసికుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వరూపరాజుతో పాటు మధ్యవర్తి నూర్ ను కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

నా మీదనే దాడి చేయిస్తావా 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?