Advertisement

Advertisement


Home > Politics - Political News

పిచ్చికి ప‌రాకాష్ట ఆర్‌కే ‘కొత్త‌ప‌లుకు’

పిచ్చికి ప‌రాకాష్ట ఆర్‌కే ‘కొత్త‌ప‌లుకు’

ప్ర‌తి ఆదివారం ఆంధ్ర‌జ్యోతి సంపాద‌కీయ పేజీలో ఆర్‌కే రాస్తున్న‌ ‘కొత్త‌ప‌లుకు’లో హేతుబ‌ద్ధ‌త కొర‌వ‌డింది. ఒకే వ్యాసంలో ఆయ‌న చెబుతున్న వాటికి ప‌ర‌స్ప‌రం పొంత‌న‌ కుద‌ర‌డం లేదు.  ఈ వారం ‘మంట కలిసిన మర్యాద’ శీర్షిక‌తో రాసిన క‌థ‌నం ఆర్‌కే మాన‌సిక దుర‌వ‌స్థ‌ను, గంద‌ర‌గోళాన్ని, భ‌యాన్ని, నిస్స‌హాయ‌త‌ను ప్ర‌తిబింబిస్తోంది. పాతాళానికి అక్ష‌ర రూప‌మే ఆర్‌కే కొత్త‌ప‌లుకు. 

ఏం రాస్తున్నాడో, ఏం చెప్పాల‌నుకున్నాడో ఆయ‌న‌కే తెలియ‌ని ద‌య‌నీయ స్థితిలో అక్ష‌రం ప‌త్రిక‌కెక్కింది. ప్ర‌తి వారం అచ్చ‌య్యే ‘కొత్త‌ప‌లుకు’ ఆర్‌కే గౌర‌వాన్ని పెంచ‌క‌పోగా, ఆయ‌న అజ్ఞానం, అహంకారం, అప్ర‌జాస్వామిక ధోర‌ణుల‌కు ప్ర‌తీక‌గా నిలుస్తోంది. ఈ అవ‌ల‌క్ష‌ణాల కొన‌సాగింపే ఈ వారం కొత్త‌ప‌లుకు కూడా. 

 ‘విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కావాలని ఎవరు అడిగారు?’ అని ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు, కొంతమంది శాసనసభ్యులు ఆంతరంగిక సంభాషణలలో ప్రశ్నిస్తున్నారు. మేం ప్రశాంతంగా బతుకుతున్నాం. ఉన్నదాంతో సంతృప్తిపడే మనస్తత్వం మా ప్రజలది. ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి అనుచరులు విశాఖలో వాలిపోతారన్న భావనే మాకు రుచించడం లేదు. మేం సంపాదించుకున్న భూములకు టికానా ఉండదా? అన్న ఆందోళనలో మేం ఉన్నాం’  అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. విశాఖలో స్థలాలు, భూములు ఉన్నవారు అవి కబ్జాకు గురవుతాయేమోనన్న భయంతో ప్రహరీలను నిర్మించుకుంటున్నారు. వాస్తవ పరిస్థితి ఇది కాగా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ప్రగల్భాలు పలుకుతున్నారు’...ఇవి కొత్త ప‌లుకులోని ఆర్‌కే విష‌పు రాత‌లు. 

 మ‌రి ఇదే పెద్ద మ‌నిషి....ఇదే వ్యాసంలో   ‘రాజధాని విలువ, నగర ప్రాధాన్యం తెలియనివాళ్లు లేదా తెలిసినా గుర్తించడానికి ఇష్టపడనివాళ్లు రాజ్యమేలుతుంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి’ అని రాశాడు. 

రాజ‌ధాని విలువ అంటే ఏంటి? ఆ విలువ ఏంటో తెలియ‌క‌నే ఉత్త‌రాంధ్ర‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు విశాఖ‌లో ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని పెట్ట‌మ‌ని ఎవ‌రు అడిగార‌ని ఆంత‌రింగిక సంభాష‌ణ‌ల్లో అమాయ‌కంగా ప్ర‌శ్నిస్తున్నారా ఆర్‌కే? ఉన్న‌దాంతో సంతృప్తి ప‌డే మ‌న‌స్త‌త్వం ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌దైతే, లేనిదాని కోరుకునే అత్యాశ ప‌రులు అమ‌రావ‌తి రైతుల‌ని మీ రాత‌ల‌ను బ‌ట్టి అర్థం చేసుకోవాలా సార్‌.

పోయిన వారం కూడా ఇదే ప‌లికారు క‌దా!  ఏదైనా కొత్త‌గా ప‌ల‌కండి సార్. చెప్పిందే చెప్పి, రాసిందే రాస్తూ...ఇంత‌కూ ఏమైంది సార్ మీకు. రాత త‌డ‌బ‌డుతోంది. మ‌న‌సు నిశ్చ‌లంగా ఉండ‌టం లేదు. ఏదో అశాంతి,  భీతి, శోకం, అస‌హ‌నం, ఆగ్ర‌హం, ఆక్రోశం. ఈ ల‌క్ష‌ణాల‌న్నీ దేనికో సంకేత‌మ‌నే భావ‌న క‌లుగుతోంది. రాజ‌ధాని, జ‌గ‌న్ గురించి ఆలోచించ‌డం కొంత కాలం మానేయండి సార్‌. ఎందుకంటే ముందు మీ మ‌న‌సు, మీరు బాగుంటేనే....మిగిల‌న‌వ‌న్నీ.

ప్రజలకు మేలు చేయని మండలి అవసరమా?

వ్యవస్థని ప్రక్షాళన చెయ్యాలి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?