కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో చాలా మంది ఆకలితో అల్లాడుతుంటే....కొందరు సెలబ్రిటీలు వంటావార్పుల వీడియోలతో హల్చల్ చేయడంపై టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తీవ్రంగా తప్పు పట్టారు. ట్విటర్ వేదికగా ఆమె అలాంటి సెలబ్రిటీలపై ఆగ్రహం ప్రదర్శించారు.
‘మన వంట వీడియోలు, రుచుల ఫొటోల పోస్టింగ్ పూర్తయ్యిందా లేదా’ అని సానియా మీర్జా ఘాటుగా ప్రశ్నించారు, నిలదీశారు. ‘ఒక్కసారి ఆలోచిం చండి... మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా మన చుట్టూ ఉన్న జనంలో వేలసంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. లక్షలాది మంది ఒక పూట తిండి దొరకడమే అదృష్టంగా భావిస్తున్నారు. ఇలాంటి సంక్షోభంలో అలాంటి వీడియోలు షేర్ చేయడమేంటి’ అని సానియా అసహనం వ్యక్తం చేశారు.
సానియా మీర్జా ట్వీట్లో లేవనెత్తిన అంశానికి నెటిజన్ల నుంచి మద్దతు లభిస్తోంది. పేదలు కష్ట కాలంలో ఆకలి తీరే మార్గం లేక అలమటిస్తుంటే....మరో వైపు కొందరు సెలబ్రిటీలు ఎవరినీ కించపరచడానికి కాకపోయినా పాకశాల ముచ్చట్లు చెప్పుకోవడం ఏంటనే వాదన బలంగా వినిపిస్తోంది. లోకో భిన్న రుచి అంటారు. ఎవరి అభిప్రాయాలు, అలవాట్లు వారివి. జోక్యం చేసుకోడానికి మనమెవరం?
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు