Advertisement

Advertisement


Home > Politics - Political News

శోభ‌నం రాత్రి...శాశ్వ‌త‌ నిద్ర‌లోకి!

శోభ‌నం రాత్రి...శాశ్వ‌త‌ నిద్ర‌లోకి!

శోభ‌నం రాత్రే పెళ్లి కొడుకు శాశ్వ‌త నిద్ర‌లోకి జారుకున్నాడు. ఈ విషాద ఘ‌ట‌న జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. ఎన్నో ఆశ‌ల‌తో అత్తారింట అడుగు పెట్టిన న‌వ వ‌ధువుకు మొద‌ట రాత్రే తీర‌ని దుఃఖం మిగిల్చింది.

వ‌డ్డేప‌ల్లి మండ‌లం త‌న‌గ‌ల‌కు చెందిన సూర్య‌బాబు (24)కు అయిజ మండ‌లం సంకాపురం యువ‌తితో ఆదివారం మ‌ధ్యాహ్నం వివాహం జ‌రిగింది. ఆ రోజు రాత్రి పెళ్లి కుమారుడి ఇంట శోభ‌నం ఏర్పాటు చేశారు. రాత్రికి వ‌రుడు, వ‌ధువు ఒకే గ‌దిలోకి వెళ్లారు. సోమ‌వారం తెల్ల‌వారుజామున నాలుగు గంట‌ల స‌మ‌యంలో అత్త‌మామ‌ల వ‌ద్ద‌కు పెళ్లి కుమార్తె ఆందోళ‌న‌తో వెళ్లింది.

‘మీ కొడుకు అగుపిస్తలేడు..’ అని అత్త‌మామ‌ల‌తో న‌వ వ‌ధువు చెప్పింది. దీంతో వ‌రుడి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. పక్కగదిలో సూర్యబాబు ఉరేసుకుని వేలాడుతూ విగ‌త జీవిగా కన్పించాడు. 

భ‌ర్త ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విష‌య‌మై వెంట‌నే పుట్టినింటికి సమాచారం అందించింది. పెళ్లికూతురు త‌ల్లిదండ్రులు, బంధువులు ఓ వాహ‌నంలో వ‌చ్చారు. పెళ్లికూతురు పుస్తెలతాడు, మెట్టెలు, పెళ్లిచీర వదిలేసి త‌మ వారు తెచ్చిన వాహ‌నంలో పుట్టినింటికి వెళ్లిపోయింది.

దీంతో పెళ్లి కూతురిపై వ‌రుడి త‌ల్లిదండ్రులు అనుమానం వ్య‌క్తం చేశారు. త‌మ కుమారుడి అనుమానాస్ప‌ద మృతిపై సూర్యబాబు కుటుంబసభ్యులు శాంతినగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ శ్రీహరి పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?