Advertisement

Advertisement


Home > Politics - Political News

టీడీపీతో పొత్తులేదు, జనసేనతో ఛాన్సే లేదు!

టీడీపీతో పొత్తులేదు, జనసేనతో ఛాన్సే లేదు!

తెలుగుదేశం పార్టీతో పొత్తు అనేది ముగిసిపోయిన అధ్యాయం అని అంటున్నారు బీజేపీ నేత సునీల్ దేవదార్. ఆ పార్టీ ఏపీ వ్యవహారాల బాధ్యుడిగా ఉన్న ఆయన చంద్రబాబు మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీతో పొత్తు ఉంటుందంటూ.. చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటన పట్ల సునీల్ తీవ్రంగా స్పందించింది. చంద్రబాబుతో ఒక పొత్తు ఉండదని ఇప్పటికే అమిత్ షా ప్రకటించేశారని, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం పార్టీతో దోస్తీ అనేది ముగిసిపోయిన అధ్యాయం అన్నారు. ఒకవైపు తెలుగుదేశం నుంచి నేతలు బీజేపీలోకి క్యూ కడుతూ ఉంటే.. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అలాంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారన్నారు. పార్టీలో నేతలను మిగుల్చుకునేందుకు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు అని అంటున్నారని ధ్వజమెత్తారు.

చంద్రబాబుతో ఇక తమకు స్నేహం అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. మొత్తానికి బీజేపీ మీద చంద్రబాబు నాయుడు ప్రేమ ప్రకటనలు చేస్తూ ఉంటే, ఆ పార్టీ జాతీయ నేతలు మాత్రం చంద్రబాబును ఇక పట్టించుకునేది లేదని ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అలాగే జనసేనతో కూడా భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోదని ఈ బీజేపీ నేతల వ్యాఖ్యానించడం గమనార్హం.

తెరమీద నీతులు.. తెర వెనుక బ్లాక్ మెయిలింగ్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?