Advertisement

Advertisement


Home > Politics - Political News

కర్ణాటక.. కోర్టు తీర్పు ఎవరికి అనుకూలం?

కర్ణాటక.. కోర్టు తీర్పు ఎవరికి అనుకూలం?

రాజీనామాల విషయంలో కాంగ్రెస్-జేడీఎస్ లకు ఊరటను ఇచ్చేలా ఉంది తీర్పు. అయితే ఎమ్మెల్యేల హాజరు వారి ఇష్టం అని కోర్టు తేల్చిచెప్పింది. దీంతో విశ్వాస తీర్మానానికి గైర్హాజరీ అయ్యి అసంతృప్తిని వ్యక్తం చేసే అవకాశం ఎమ్మెల్యేకు దక్కింది. అయితే వారికి కాంగ్రెస్, జేడీఎస్ లు విప్ జారీ చేయవచ్చు. విప్ ను ధిక్కరిస్తే వారిపై అనర్హత వేటు కూడా వేయచ్చు.

విశ్వాస పరీక్ష అనంతరం సంకీర్ణ సర్కారు కుప్పకూలకుండా ఉంటే అప్పుడు ఏదైనా చేయవచ్చు. కానీ అసంతృప్త ఎమ్మెల్యేల నంబర్ ను మైనస్ చేస్తే కుమారస్వామి సర్కారు కూలిపోవడం ఖాయం. విశ్వాస పరీక్షకు వారు గైర్హాజరు అయినా, అంతలోపే వారిపై అనర్హత వేటు వేసినా.. కుమారస్వామి ప్రభుత్వం నిలబడటం మాత్రం జరిగేలా లేదని పరిశీలకులు అంటున్నారు.

గురువారం కర్ణాటక శాసనసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కొనబోతోంది కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు. 

మళ్ళీ ఆత్మగౌరవం నినాదం.. మారానని ప్రచారం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?