Advertisement

Advertisement


Home > Politics - Political News

హీరోలు సేమ్.. మ్యూజిక్ డైరక్టర్స్ అటుఇటు

హీరోలు సేమ్.. మ్యూజిక్ డైరక్టర్స్ అటుఇటు

మొన్నటివరకు దేవిశ్రీప్రసాద్, తమన్ మధ్య ఓ రేంజ్ లో సంక్రాంతి వార్ జరిగింది. అల్టిమేట్ గా తమన్ దే పైచేయిగా నిలిచింది. ఈ విషయంలో తమన్ కు అల్లు అర్జున్ ఫుల్ సపోర్ట్ ఇవ్వగా.. పాటలు అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ దేవిశ్రీని చక్కగా వెనకేసుకొచ్చాడు మహేష్ బాబు. కట్ చేస్తే.. ఇప్పుడీ సంగీత దర్శకులు ఇద్దరూ తమ పొజిషన్లు మారారు. 

ఈసారి అల్లు అర్జున్ సినిమాకు దేవిశ్రీ పనిచేయబోతున్నాడు. అలాగే మహేష్ సినిమాకు తమన్ వర్క్ చేయబోతున్నాడు. దేవిశ్రీ-సుకుమార్ ది హిట్ కాంబో. తన ప్రతి సినిమాకు దేవిశ్రీనే తీసుకుంటాడు సుక్కూ. సో..బన్నీ మూవీకి కూడా అతడ్నే రిపీట్ చేశాడు. 

ఇటు మహేష్ కూడా తమన్ ను తీసుకున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ చేయబోయే సినిమాకు తమన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. అల వైకుంఠపురములో సినిమాతో బన్నీకి ఆల్ టైమ్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్ ఇచ్చిన తమన్, ఈసారి మహేష్ కు ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడో చూడాలి. 

ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే.. మొన్ననే మహేష్ మూవీపై పరోక్షంగా సెటైర్లు వేశాడు తమన్. అల వైకుంఠపురములో సక్సెస్ సంబరాల్లో మాట్లాడుతూ.. నిజమైన మాటలే మాట్లాడుకుందాం, నిజమైన కలెక్షన్లనే చెప్పుకుందామంటూ ఇండైరెక్ట్ గా సరిలేరు నీకెవ్వరుపై సెటైర్లు వేశాడు. కట్ చేస్తే, ఇప్పుడు మహేష్ మూవీకి మ్యూజిక్ డైరక్టర్ గా ఫిక్స్ అయ్యాడు. 

అన్నట్టు ఈసారి కూడా మహేష్ మూవీకి పోటీగా తన సినిమాను దించాలని భావిస్తున్నాడట అల్లు అర్జున్. అదే కనుక జరిగితే మరోసారి తమన్-దేవిశ్రీ మధ్య పోటీ తప్పకపోవచ్చు.

రాజ్ డిస్కో రాజ్

సునీల్ టైమింగ్ కి హాట్స్ ఆఫ్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?