వ్యక్తుల స్వభావంలోని ఒక అంశం ఏమిటంటే.. ఇక తాము ఏమీ చేయలేనప్పుడు తమకు నచ్చని వారిని బూతులు తిట్టి సంతృప్తి పొందడం.
అవతల వారికి ఆ బూతులు వినపడతాయా? అర్థం అవుతాయా? వాటిని సీరియస్ గా తీసుకుంటారా? అనే అంశాలతో సంబంధం లేకుండా.. కొంతమంది నచ్చని వారిని, నచ్చని పని చేసిన వారిని బూతులు తిట్టి సంతృప్తి పొందుతూ ఉంటారు. అయితే పదుగురిలో ఉన్నప్పుడు చాలా మంది కాస్త జాగ్రత్తగా మాట్లాడతారు.
చుట్టూ ఎంతమంది ఉన్నా అలా బూతులు మాట్లాడే వాళ్లు మాత్రం కచ్చితంగా మానసిక రోగులే. సభ్యత, సంస్కారాలను కనీసం చుట్టూ ఉన్న వారి కోసమైనా కాస్త వ్యక్తీకరించాలి. ప్రత్యేకించి రాజకీయ నేతలు, బాధ్యతాయుతమైన హోదాల్లో ఉన్న వారు వాటిని పాటించాలి.
14 సంవత్సరాల పాటు ఏపీకి ముఖ్యమంత్రిగా, ఇప్పటి వరకూ 12 యేళ్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు మాత్రం పచ్చిబూతులు మాట్లాడుతున్నారు. లైవ్ టెలికాస్ట్ లో కూడా ఆయన మొహమాటపడకుండా బూతులు మాట్లాడుతున్నారు.
ఆయనే అనుకుంటే ఆయన తనయుడు లోకేష్ కూడా ఇందుకు తయారయ్యాడు. జగన్ ను , జగన్ చుట్టూ ఉన్న వాళ్లను బూతులు తిట్టడం వీరికి పనిగా మారింది. ఆఖరికి విశాఖ శారద పీఠాధిపతి ని కూడా దూషించిన ఘనత చంద్రబాబుది.
ఇంతకీ వీరు ఈ తీరు వల్ల చాటుకున్నది ఏమిటి? అంటే.. తమ సంస్కార హీనత, తమ అసహనం మాత్రమే అని స్పష్టం అవుతోంది. మరో విశేషం ఏమిటంటే.. వీరు ఎన్ని గలీజు మాటలు మాట్లాడినా సీఎం వైఎస్ జగన్ స్పందించడం లేదు.
ఇది వీరికి మరింత అసహనానికి గురి చేస్తూ ఉంది. ఒకవేళ జగన్ గనుక చంద్రబాబు తిడుతున్నాడని చెప్పి తను కూడా తిట్టడం మొదలుపెట్టి ఉంటే.. అప్పుడు చంద్రబాబు లెక్క సరిపోయేదేమో. అయితే వైఎస్ జగన్ మాత్రం చంద్రబాబు తీరును లైట్ తీసుకున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు ఒక్కో స్టెప్ మరింత దిగజారక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు బూతులు మాట్లాడుతున్న చంద్రబాబు, లోకేష్ లు ఈ ఫ్రస్ట్రేషన్లో ఇంకా పచ్చిబూతులు మాట్లాడేలా ఉన్నారు కూడా. అయితే ఇలా మాట్లాడటం వల్ల టీడీపీకి మళ్లీ అధికారం దక్కుతుందా? ఈ థర్డ్ గ్రేడ్ లాంగ్వేజ్ తో చంద్రబాబు, లోకేష్ లు మరింతగా పలుచన కావడం తప్ప ఇంకో ప్రయోజనం అయితే ఉండకపోవచ్చు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు