జాలేస్తోంది... చంద్రబాబు కోల్పోయిన అవకాశాన్ని చూసి.. జాలేస్తోంది.. కరోనా కోరలు పీకుతున్న జగన్ను గుర్తించని మీడియాను చూసి.. ఏపీ రాజకీయాలు, ఇక్కడి మీడియా గురించి జత పుష్కరకాలంగా పరిశీలిస్తున్న వ్యక్తిగా నాకు తోచింది, నిజంగా ఇదే నిజమని నేను తలచింది ఇక్కడ రాసుకుంటున్నాను. పాఠక మహాశయులు అన్యధా భావించ వలదు.అదేగనుక...ఇప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రివర్యులుగా శ్రీమాన్ చండ్ర ప్రచండ చంద్రబాబుగారు గనుక ఉండి ఉంటే మీడియా ఏ రీతిన వీరవిహారం చేస్తూ ఉండేదో తెలుసా..? కరోనా వైరస్ ను ఆసరా చేసుకుని బాబుగారి ఇమేజ్ను ఏ స్థాయిలో పెంచే ప్రయత్నం చేసేదో తెలుసా..?
చంద్రబాబునాయుడు ఈ రాష్ట్రానికి సీఎంగా ఇప్పుడు ఉండి ఉంటే వంద క్రేన్లు, లక్ష జాకీలు కలిసినా సాధ్యం కానంత ఎత్తులో మీడియా బాబును ఆకాశానికి ఎత్తేసేది. బాబు సీఎం అయి ఉండి ఉంటే మీడియాలో కథనాలు ఎలా ఉండేవో అనే ఆలోచన మెదిలి... ఇదిగో ఇలా ఉండేది అని చెప్పడానికి నేను ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను. నా మెదడుకు తట్టిన కొన్ని విషయాలు ఇక్కడ రాస్తాను. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో బాబు సీఎంగా ఉండి ఉంటే మన రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసులు నమోదయ్యేవో చెప్పలేం. ఒకవేళ ఇప్పుడు నమోదైనట్లుగా కేవలం 8 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యే పని అయితే మీడియాలో కథనాలు ఇదిగో ఇప్పుడు ఇక్కడ నేను రాస్తున్నట్లుగానే ఉంటాయండోయ్.. రెడీవన్టూ_త్రీ
-దొడ్డా రామకృష్ణ
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు